అదేంటోగాని ఈమధ్య తెలుగు తమ్ముళ్లు అధినేత చంద్రబాబు ముందే తెగ ఫైటింగ్ చేసేస్తున్నారు. ఇటీవలే కడప పర్యటనలో చంద్రబాబు ఉన్న విషయం తెలిసిందే. రాయలసీమలో పర్యటిస్తూ ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి టిడిపి పార్టీ యొక్క స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు ఆయా నేతలను కార్యకర్తలను దిశానిర్దేశం చేసేందుకు చంద్రబాబు కర్నూల్ లో పర్యటిస్తున్నారు. అయితే చంద్రబాబు కర్నూల్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో నిరసన కార్యక్రమాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఎంతోమంది చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు పెట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వ హయాంలో కనీసం కర్నూల్ ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని చంద్రబాబుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 

 అయితే ఇప్పటికే టిడిపి అధినేత అయిన చంద్రబాబు ముందు టిడిపి నేతలు కుమ్ములాట జరిగిన విషయం తెలిసిందే. ఎంత వద్దని వారిస్తున్నా కూడా టీడీపీ నేతలు మాత్రం వినిపించుకోకుండా అధినేత ముందే కుమ్ములాట జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు కర్నూలులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలులో పర్యటిస్తూ పార్టీ నేతలతో సమావేశమై వారికి పలు సూచనలు చేయడంతో పాటు పార్టీ అభివృద్ధికి ఎలా పాటుపడాలని అనేదానిపై దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలులో పాణ్యం నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 

 

 

 

 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో నిర్వహించిన సమావేశం కాస్త రసాభాసగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే టిడిపి నేతల మధ్య కొట్లాట ఏర్పడింది. మాటలు కాస్తా చేతల వరకు వెళ్లి టిడిపి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముందర ఒకరి మీద ఒకరు పడి తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే తన ముందు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం ఏర్పడి కొట్టుకోవడం పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు  సోమిశెట్టి వెంకటేశ్వర్లు... మల్లికార్జున మధ్య వాగ్వాదం ఏర్పడి ఇరువర్గాలు కొట్టుకుపోవడంతో చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ముందే తన్నుకుంటారా ఏం తమాషాగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. నా ముందే రైతులకు అనుకుంటే ఇంకా కార్యకర్తలను ఎలా కంట్రోల్ చేస్తారు అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: