హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ పై హత్యాచారం మానవత్వం ఉండి ఇన్నాళ్లూ అన్నం తినే మనుషులు చేసిన ఘటన కాదు ఇది. అసలు వీరు తోలు కప్పుకున్న తోడేళ్లూ. ఏ మాత్రం భయం లేకుండా చేసిన పనిని నిర్భయంగా పూస గుచ్చినట్లుగా చెబుతుంటే ఇన్నాళ్లూ మనుషులనుకున్న ఈ ఎదవల్లో ఇంత కౄరత్వం దాగుందా అనిపిస్తుంది. ఇకపోతే ఈ ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, తర్వాత ఆమెను హత్య చేశారు. అయితే, ఈ కేసులో నిందితుల దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న కొద్ది ఈ నాయాళ్లను అవికోసి గద్దలకేసీ జీవితాంతం బాధలు అనుభవిస్తూ ఎందుకు బ్రతికామా అనేలా శిక్షించాలి.

 

 

ఒక్క సారి చంపేస్తే ఆ బాధ వీళ్లకూ అర్ధం అవదూ. అయితే ఇప్పటివరకు పోలీసులు దిశను ముక్కు, నోరు మూసి చంపేసిన తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టినట్లు చెబుతున్నారు. కానీ, ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు చర్లపల్లి జైల్లో ఉన్న కీలక నిందితుడు ఆరిఫ్‌ కొందరు కిందిస్థాయి అధికారులకు చెప్పిన విషయం బయటకు వచ్చింది. ఈ మృగం ఏమాత్రం  భయపడకుండా పలు విషయాలు బయటపెట్టినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

 

 

ఘటన జరిగిన రోజున ఆరిఫ్‌ సహా మరో ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కుని వెళ్తుంటే ఆమె రక్షించడంటూ పెద్దగా కేకలు వేసిందట. ఆమె అరుపులు ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు వెంటనే తన జేబులోని మద్యాన్ని తీసి బలవంతంగా ఆమె నోట్లో పోశాడట. దీంతో స్పృహ కోల్పోయిన దిశపై కామాంధులు శునకాల్లా అనుభవించి తరువాత లారీలోకి ఎక్కించి అందులోనూ మళ్లీ అత్యాచారం చేశారట. మద్యం తాగించి, పాశవికంగా అత్యాచారానికి పాల్పడంతో బాధితురాలు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

 

 

దీంతో ఆమె చనిపోయినట్లుగా భావించి చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువెళ్లి బతికి ఉండగానే పెట్రోల్‌ పోసి నిప్పటించారు. నిజంగా ఈ నిజాలు వింటుంటే ఇలాంటి నీఛపు వెధవల విషయంలో విచారణ ఎందుకు సార్ వెంటనే శిక్ష అమలు చేయక అని నిజమైన మనుషులుగా బ్రతుకుతున్న వారు ఆక్రోశిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: