వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే దిశ ఘటనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                         

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా?'' అంటూ ట్విట్ చేశారు. 

          

అయితే దిశ ఘటనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించాయి. ఇప్పటికే భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి కూడా దేశవ్యాప్తంగా ప్రజలు అంత నిరసనలు చేస్తుంటే రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు అంటావు ఏంటి పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు పవనిజం అంటే ఇదేనేమో.. రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా అని ప్రశ్నించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: