వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై.. అతని సుపుత్రుడు నారాలోకేష్ మరోసారి భారీ స్థాయిలో ట్విట్టర్ వేధికగా విరుచుకుపడ్డడు. ఎప్పుడు ప్రతిపక్షాలపై జోకులు వేసే విజయసాయి రెడ్డి ఈసారి వేసిన జోకులు చూస్తే కడుపు ఉబ్బిపోయేలా నవ్వుతారు. లోకేష్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి. 

                    

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''ఒకాయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఇంకొకాయన అజ్ణానాంధకారాన్ని కవర్ చేసుకునేందుకు రాజ్యాంగాన్ని ఔపోసన పట్టానంటాడు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇంత నీచత్వానికి పాల్పడాలా అని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారి పోయారిద్దరూ.'' అంటూ ట్విట్ చేశారు. 

                      

ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారి పోయారు తండ్రి కొడుకులు.. తండ్రి 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర అంటాడు కొడుకు ఏమో ఇలా అంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. ఈ ట్వీట్లకు నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. ఏంటి చంద్రబాబు నీ పరిస్థితి ? నువ్వు ఎంత కష్టపడినా నీ కొడుకు రాజీకీయాలలో ఉండడులే.. ఎం బయపడకు అంటూ ట్విట్ చేశారు. దింతో ప్రస్తుతం విజయసాయి రెడ్డి పెట్టిన ట్విట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: