వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీలోకి విలీనం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అంటూ విజయసాయి రెడ్డి సంచలన ట్విట్ చేశారు.       

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''వానపడుతుంటే, ఎండ కాస్తుంటే గొడుగు పట్టుకుని బయటకు వెళ్తారు ఎవరైనా. దత్త పుత్రుడు ఈ రెండిటికీ భిన్నం. శీతాకాలంలో గొడుగుతో తిరుగుతాడు. గంట గంటకూ చిత్త భ్రమలకు లోనవుతుంటాడు. ఏ సమయంలో ఏ డైలాగ్ వదులుతాడో అంతుబట్టదు. బిజేపీలో విలీనానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు.'' అంటూ ట్విట్ చేశారు.     

 

ఇంతలో బీజేపీ పార్టీలో జనసేన విలీనంకు పవన్ బాబు సిద్దమవుతున్నాడు అని విజయసాయి రెడ్డి కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు ఏలాంటి డైలాగ్ వేస్తాడో పవన్ కళ్యాణ్ కే తెలియట్లేదు అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్లకు నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నా.    

 

మరింత సమాచారం తెలుసుకోండి: