జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాటలు ఎక్కువ మేటర్ తక్కువ అని ఇప్పటికే జనాలకు అర్ధమైపోయింది. ఆ విషయం ఎన్నికల్లోనే రుజువు చేశారు. అంత డైరెక్ట్ గా ప్రజలు తీర్పు ఇచ్చిన పవన్ లో మాత్రం ఏ మార్పు రాలేదు. ఇప్పటికి అదే విధంగా స్థాయికి మించి మాటలు మాట్లాడుతూ ప్రజల్లో ఇంకా చులకన అవుతున్నారు. తాజాగా కూడా పవన్ చేసిన కామెంట్లని చూస్తుంటే ఫుల్ కామెడీగా అనిపిస్తున్నాయి.

 

మొన్న, ప్రజలకు మంచి పాలన అందిస్తున్న జగన్ ని పాలన చేతకాకపోతే దిగిపోయి ఎన్నికలు పెట్టాలని మాట్లాడిన పవన్...ఇప్పుడు తాను టీడీపీ-బీజేపీతో కలిసి పోటీ చేస్తే వైసీపీ గెలిచేదా? అని ప్రశ్నించారు. కాబట్టి అలా తన వల్లే వైసీపీ గెలిచిందని గొప్పలు చెప్పేశారు.  అయితే మాటలు ఫుల్ కామెడీగా ఉన్నాయి. పవన్ ఏదో తోపు లాగా టీడీపీ-బీజేపీతో కలిసి పోటీ చేస్తే వైసీపీ గెలిచేది కాదని సినిమా డైలాగ్ వేశారు గానీ... ఒకవేళ ముగ్గురు కలిసి పోటీ చేసిన ప్రజలు ఇంకా ఘోరంగా ఓడించే వాళ్ళు.

 

అసలు మామూలుగానే బీజేపీ రాష్ట్ర సమస్యలు పరిష్కరించలేదని, ప్రత్యేకహోదా ఇవ్వలేదని ప్రజలు ఫుల్ కోపంతో ఉన్నారు. అటు చంద్రబాబు పాలన పట్ల విసిగెత్తిపోయి ఉన్నారు. ఇక పవన్ ఐదేళ్లు ఆటలో అరటిపండులాగా ఉండిపోయాడు. పైకి వేరు వేరుగా ఉన్న ఎన్నికల సమయంలో జనసేన-టీడీపీలు లోపాయికార ఒప్పందంతోనే పోటీ చేశాయని జనాలకు పూర్తిగా అర్ధమైంది. అందుకే వారిని చిత్తు చిత్తుగా ఓడించారు.

 

ఇక ఇలా కాకుండా డైరెక్ట్ గా వీరు బీజేపీతో కలిసి పోటీ చేస్తే మరింత దారుణంగా ఓడించేవారు. టీడీపీకి ఇప్పుడు వచ్చిన 23 సీట్లు కూడా వచ్చేవి కాదు. అటు ముక్కిమూలిగి గెలుచుకున్న ఒక్క సీటు కూడా జనసేనకు వచ్చేది కాదు. ఈ పరిస్తితులు ఏం తెలుసుకోకుండా ఇప్పుడు పవన్ ఇలా డైలాగులు వేసి సినిమాల్లో కమెడియన్ కంటే దారుణంగా తయారయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: