వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''నీ ప్యాకేజీ పార్టీని ప్రజలు గుర్తించకనే డిపాజిట్లు కూడా దక్కనంతగా ఛీ కొట్టారు. దత్తపుత్రుడివని తెలిసే భీమవరం, గాజువాక ఓటర్లు స్థానిక నాయకులను అక్కున చేర్చుకున్నారు. నువ్వే పెద్ద తిరస్కృతుడివి. ఇంకొకరిని గుర్తించాలా, విస్మరించాలా అనే స్థాయి నీకెక్కడిది పవన్ నాయడు?'' అంటూ ట్విట్ చేశారు. 

 

దీంతో ఈ ట్వీట్లకు స్పందించిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 6 నెలల్లోనే అవినీతిలో 13 వ స్థానానికి తరిమికొట్టి, ఇచ్చిన హామీల్లో దాదాపు 80% పూర్తిచేసి, సుమారు 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, మద్యంపై ఉక్కుపాదం మోపుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా పాలన చేస్తున్న జగనన్నను ఈ దేశమే గుర్తించింది.నువ్వెంత పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి.    

 

మరింత సమాచారం తెలుసుకోండి: