ఇటీవలే కాలంలో రోడ్డు యాక్సిడెంట్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలం అయితే మరి దారుణంగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ పై నుండి కారు పడి మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. ఇంకా ఇలాంటి దుర్ఘటనలు చాలానే జరుగుతున్నాయి. 

                                                 

అయితే ఈ నేపథ్యంలోనే కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతిచెందారు. కాగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

                                              

దీంతో ఆ నలుగురిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం బస్సు స్టాండ్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘోరమైన ఘటన జరిగింది. ఈ ఘాట్ రోడ్డులో ఓ మలుపు వద్ద రాజమండ్రి, ధర్మవరం డిపోలకు చెందిన రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ధర్మవరం డిపో బస్సులో ఉన్న ఇద్దరు మహిళలు చనిపోయారు. 

                                     

ఆ యాక్సిడెంటులో ఆ ఇద్దరి మహిళా మృతదేహాలు చెల్లాచెదురై గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: