ప్రేమ అనగానే మొదట తల్లి ప్రేమ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ప్రియుడి, లేదా ప్రియురాలు ప్రేమ గుర్తుకు వస్తుంది. కాని ఇక్కడ ప్రియుడు ప్రియుడు అనే రెండు ప్రేమల కధ గుర్తుకు రావాలి. అవును ఇదో విన్నూతనమైన ప్రేమ కధ. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకునే కాలాన్ని దాటాము. అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఘటనలు చూసాము. ఇప్పుడు అమ్మాయి, మరో అబ్బాయి పెళ్లి గోల చూద్దాము.

 

 

సూర్యాపేట పట్టణంలో ఓ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడికి, పట్టణానికి చెందిన గుండ్లగాని సాయితో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వారి మధ్య ప్రకృతికి విరుద్దంగా ప్రేమ చిగురించింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరు మగవారు కావడంతో సమాజంలోని కట్టుబాట్ల కోసం కొంత ఆలోచించి జానయ్య తో నువ్వు మహిళగా లింగ మార్పిడి చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని సాయి చెప్పాడు.

 

 

అతను చెప్పిందే తడవుగా మరో ఆలోచన లేకుండా జానయ్య లింగమార్పిడి చేయించుకున్నాడు. తీరా జానయ్య మహిళగా మారిన తర్వాత సాయి మోహంచాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీ పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పుడు సమాజానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనలో ఉన్న సమస్యను ఎలా విప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు..

 

 

ఇకపోతే మగానిగా ఉన్నా కొన్ని సమస్యల నుండి బయటపడి బ్రతకవచ్చూ కాని ఇప్పుడు లింగమార్పిడి చేసుకుని మహిళగా మారిన తర్వాత లాస్ట్‌మినిట్‌లో సాయిపెళ్లికి నిరాకరించడంతో మహిళగా మారిన జానయ్య పరిస్దితి కుడితిలో పడ్ద ఎలుకలా మారిందనుకుంటున్నారు ఈ విషయం తెలిసినవారు. మరి కొందరైతే కలికాలంలో నాశనగాలం పుడితే ఇలాంటి ఆలోచనలే పుట్టుకొస్తాయని దుమ్మెత్తి పోస్తున్నారట.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: