ఒక అమాయకపు ఆడపిల్లను దారుణంగా రేప్ చేసి హత్య చేసిన మానవ మృగాల గురించి ఎన్నో విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే జనాల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. అయితే షాద్ నగర్ సమీపంలో జరిగిన వెటర్నరీ వైద్యురాలి గ్యాంగ్ రేప్, హత్య కేసును పోలీసులు త్వరిత గతిన ఛేదించారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది . ఇక వారిని తిరిగి విచారించాలని ఇంకా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చెయ్యాలని నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది . ఇక తాజాగా ఈ కేసులో మరోమారు పోలీసుల విచారణ కొనసాగుతున్న సమయంలో నలుగురు మృగాళ్ళు చేసిన మరికొన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

 

ఇంత దారుణానికి ఈ మృగాలు పూనుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిశ హత్య ఘటనలో మరికొన్ని దారుణ నిజాలు బయటకు వచ్చాయి. అయితే నలుగురు మృగాళ్ళు దిశ అపస్మారకస్థితిలో ఉన్నప్పుడే పెట్రోల్ పోసి తగటబెట్టారని తాజాగా జైల్లో వారి సంభాషణ ద్వారా తెలుస్తుంది.చనిపోయిన తరువాత కాదు దిశను బ్రతికి ఉండగానే సజీవ దహనం చేశారన్న విషయం వారి మాటల ద్వారా గుర్తించారు జైలు సిబ్బంది .


అయినప్పటికీ వారికీ తప్పు చేశామన్న భయం కూడా లేదు. ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా జైలు కాపలాదారుని దగ్గర ఈ విషయాన్ని చెప్పాడు ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌. ప్రస్తుతం దిశ హత్య కేసు నిందితులు నలుగురు చర్లపల్లి జైలులో, ప్రత్యేక నిఘాలో ఉన్నారు. వీరికి కాపలా కాస్తున్న కొంతమంది సిబ్బంది తాజాగా వారి మానసిక స్థితి అంచనా వెయ్యటానికి వారితో మాటలు కలిపిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జైలులో ఉన్నా వీరిలో ఏ మాత్రం తప్పు చేశామన్న భావం లేకపోవటం సిబ్బంది గుర్తించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: