ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకుంటూ ఆడపిల్లలను మానసికంగా హింసిస్తూ స్త్రీలపైనా అఘాయిత్యాలకు పాలుపడుతున్న ఈ దొంగ స్వామిజి మీడియా కి అడ్డంగా దొరికారు అప్పట్లోనే కర్నాటకలో తనపై నమోదైన రేప్ కేసు నుంచి తిప్పంచుకోవడానికి దేశం వదిలి పరారైన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజి పరాయి దేశంలోగల ఒక  ద్వీపంలో  సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నానని అక్కడ కష్టాలు ఉండవని దానిపేరు కైలాసమని దీనికి ఏకాధిపతి అతనే నని ప్రకటించాడు.అక్కడి దేశానికి వెళ్ళడానికి  దానికి సొంత పాస్‌పోర్టును కూడా సృష్టించారు.

ఆ కొత్త దేశమైన ఈ కైలాసానికి ఒక  వెబ్‌సైట్‌ను ప్రారంభించడంతోపాటు ఈ భూమి పైన తమదే అతి గొప్ప హిందూ దేశమని  ఇక్కడ కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం దక్కుతుంది అని నిత్యానంద తన దేశం గురించి వివరించాడు. ఈ విషయం తెలిసిన ప్రతిఒక్కరు నవ్వుకొని దొంగ స్వామిజి  అని తిట్టుకున్నా ఇది నిజం.అసలు విషయానికి వస్తే  లాటిన్ అమెరికాలోని ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసిన నిత్యానందస్వామి  దాన్ని నూతన స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు.

తన దేశానికి భౌగోళిక సరిహద్దులు ఉండవని, వివిధ దేశాలలో హిందూత్వాన్ని పాటించడంలో మరియు చిన్నచూపు చేస్తుండడంతో విసిగిపోయిన  హిందువులందరికీ తమ దేశం ఆశ్రయం కల్పిస్తుందని వెబ్‌సైట్‌లో నిత్యానంద పేర్కొన్నారు. తన దేశానికి రావడానికి  సొంత పాస్‌పోర్ట్  ని కూడా ఏర్పాటు చేశామని ప్రకటించారు అందుకు సంబంధించిన విషయాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు అని వీటిగురించి తమ వెబ్ సైట్ లో ఉంచామని వివరించారు. ఈ కొత్త దేశంలో అద్యాత్మక వాతావరణం ఉంటుందని అలాగే విజ్ఞాన శాస్త్రం, యోగ, ధ్యానం, గురుకుల విద్యావ్యవస్థ ఉంటాయని పేర్కొన్నారు. అంతేగాక ఉచిత ఆరోగ్య రక్షణ, ఉచిత విద్య, ఉచిత ఆహారం, అందరికీ ఆలయ ఆధారిత జీవన విధానం లభిస్తాయని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇది చుసిన ప్రజలు వీడికి పనిలేదని అయన  దేశాన్ని విడిచిపారిపోయి ఇప్పుడు ఎదో తమాషా చేస్తున్నారని వ్యంగంగా మాట్లాడుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: