ఇటీవల చంద్రయాన్‌-2 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక పెద్ద ప్రయోగం ఈ ప్రాజెక్ట్ అంతగా విజయం వరించలేదు . దీనిపై  కాంగ్రెస్‌ ఎంపీ సౌగతా రాయ్‌  స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడి ఉపరితలంపైకి పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ కూలిపోవడంతో మన దేశం అప్రతిష్ట పాలైందని మండిపడ్డారు. ఆయన దీనిపై మాట్లాడుతూ . వెంటనే  ఇందుకు కారణమైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

 

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విఫల ప్రయోగాల కోసం  అదనపు నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.అంతేకాకుండా  అంతరిక్ష రంగం కోసం మరిన్ని నిధులు కేటాయించడం వృథా చేయకండి అని చెప్పారు . సౌగతా రాయ్‌ ఈ బుధవారం లోక్‌సభలో  వివిధ కార్యక్రమాల కోసం అదనపు నిధుల మంజూరు విషయమై చర్చ సందర్భంగా  ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 

 

కాగా బీజేపీ ఎంపీ meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి లేఖి సౌగతా రాయ్‌ మాట్లాడిన తీరు పై ఆమె స్పందించి ఈ విధంగా  ఆ  వ్యాఖ్యలపై  అభ్యంతరం వ్యక్తం చేశారు.  చరిత్రలో భారత అంతరిక్ష ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిన చంద్రయాన్‌-2 గురించి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా మట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇక  నాసా మంగళవారం సెప్టెంబరు 7న ఇస్రో... చంద్రుడి ఉపరితలం పైకి పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడలను తాము గుర్తించినట్లు  ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

అయితే నాసా ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ సాయపడటంతో విక్రమ్‌ పడిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నామని  పేర్కొంది.  అయితే దీనిపై నాసా వ్యాఖ్యలను ఇస్రో చీఫ్‌ శివన్‌ వ్యతిరేకించారు. చంద్రయాన్‌-2లో భాగంగా తాము ప్రయోగించిన ఈ ఆర్బిటార్ ఇంతకుముందే ఆ పని చేసిందని ఆయన స్పష్టం చేశారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: