ఇటీవల మహిళలు టీడిపి నేతలకు భారీ ఎత్తున బుద్ధి చెప్పారు ఇక అస్సలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో పట్టణ మహిళలు   తమకు కంచుకోటగా చెప్పుకునే పిఠాపురంలో టీడీపీ నేతలకు పెద్ద  షాకిచ్చారు. ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు  సుమారు 200 మంది మహిళా నాయకులు, కార్యకర్తలు టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఇలా వచ్చిన మహిళలందరికీ ఎంతో గౌరవంగా వారిని  ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ బుధవారం  పిఠాపురం మూడవ వార్డుకు చెందిన కె.నాగలక్ష్మి, అరుణశ్రీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది మహిళా కార్యకర్తలు నాయకులు టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు.

 

ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  ఆయన వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుంటారని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కొనసాగిస్తున్నారన్నారు.

 

ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా ఆదుకోడానికి  కట్టుబడి ఉందని,ప్రతి మహిళా పట్ల ప్రతి ఒక్క మనిషి గౌరవప్రదంగా  నడుచుకునే విధంగా తీర్చిదిద్దాలి .  అందుకే  ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని మహిళలు  వైఎస్సార్‌ సీపీలోకి   అధిక శాతం అందిస్తున్నారు . గతంలో మహిళలను టీడీపీ ప్రభుత్వం  నమ్మించి నట్టేటముంచిదని అంతే కాకుండా డ్వాక్రా మహిళలను అప్పుల పాలు చేసిందని ఆయన విమర్శించారు.

 

మహిళలందరికీ ఈ నియోజకవర్గంలో అన్ని వేళలా తాను అండగా ఉంటానని అన్ని పథకాలు మహిళలకు ఎటువంటి పైరవీలు లేకుండా అందజేసేందుకు  ఆయన  తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు బాలిపల్లి రాంబాబు పలువురు మహిళలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన మహిళలు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సత్కరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: