ఇప్పుడున్న పరిస్దితులో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందటానికి, ఐటీఆర్ దాఖలు, అధిక విలువ కలిగిన లావాదేవీలు, ఐడెంటిటీ గుర్తింపునకు. కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. ఎప్పటికి ప్రతిపనిలో ఆధార్ కార్డు చాలా అవసరం అవుతుంది. ఇదే కాకుండా ఆధార్ కార్డుతో ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపోతే ఎన్రోల్మెంట్ సమయంలో ఆధార్ వివరాల్లో తప్పులు దొర్లే అవకాశముంది. అందుకు చింతించవలసిన అవసరం లేదు.
ఇప్పుడు సులువుగా ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు గాను రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటేమో ఆన్లైన్ ప్రాసెస్. రెండోదేమో ఆధార్ కేంద్రానికి వెళ్లడం. అయితే మీ వివరాలను ఎక్కువసార్లు అప్డేట్ చేసుకోవడం కుదరదు. వాఋఇలో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలను కేవలం 1 లేదా రెండు సార్లు మాత్రమే మార్చుకోవడానికి వీలవుతుంది. అటుపైన మార్చుకోవాలంటే ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇతర వివరాలను ఎన్నిసార్లైనా మార్చుకునే వీలుంది. ఇందుకు గాను ఆధార్ వివరాల అప్డేట్కు కొంత మేర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఆన్లైన్లో ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం కుదరదు. గతంలో ఉండేది కాని ఇప్పుడు తొలగించారు. అందుకే మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్కు తప్పకుండా వెళ్లాలి.. అక్కడికి వెళ్ళాక ఆధార్ అప్డేట్ ఫామ్ ను ఫిల్ చేసి తర్వాత ఆధార్ సెంటర్లో అందించాక మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఇందులో అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది. ఇక మొబైల్ నెంబర్ అప్డేట్కు దాదాపు 10 రోజుల వరకు పట్టవచ్చు.
మన ఆధార్ కు మొబైల్ నంబర్ కనెక్ట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే యూఐడీఏఐ వెబ్ పోర్టల్కు వెళ్లి తెలుకుంటే సరి. ఇందుకు గాను మై ఆధార్ ట్యాబ్లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్లోకి వెళ్లి వెరిఫై ఈమెయిల్/మొబైల్ నెంబర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ నెంబర్ వెరిఫై అవుతుంది.. ఇక ఈ వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే రూ.50 చెల్లించవలసి ఉంటుంది...