అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా చేస్తామన్న టీడీపీ నేతలు అంతర్జాతీయ కుంభకోణంగా మార్చారని రాజధాని రైతులు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో గుంటూరులో ఈరోజు గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో  రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. 

                

దీంతో ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ రాజధాని పేరుతో టీడీపీ అందమైన కథలు చెప్పిందని విమర్శించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో భూములు కొనుగోలు చేసి చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. బినామీ పేర్లతో టీడీపీ నేతలు వందల ఎకరాలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. 

                 

పంట భూములను నాశనం చేసి ప్లాట్లు వేయడానికి సింగపూర్‌ కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. గత గురువారం ఆయన ఇక్కడ మట్లాడుతూ.. ఒక వ్యక్తి కోసం రాష్ట్రమంతా బలి కావాల్సి రావడం బాధకరమని, రాజధాని పేరుతో చంద్రబాబు భూములను బలవంతంగా లాక్కొన్నారని అయన ధ్వజమెత్తారు. దళితుల కుటుంబంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని బాబు వ్యాఖ్యానించినా ఎల్లో మీడియా అతన్ని మోస్తోందని బుగ్గన విమర్శలు చేశారు. 

               

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఆధారాలున్నాయని చెప్పారు. ఒక వ్యక్తి కోసం రాష్ట్రమంతా బలి కావాల్సిరావడం బాధాకరం అన్నారు. చంద్రబాబు రైతులను మభ్యపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఆరోపణలు చేశారు. అలాగే చంద్రబాబు రాజధానిలో చేసిన మోసాలతో.. శఠగోపం పేరుతో బ్రహ్మాండమైన సినిమా తీయొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: