ఉల్లి ధరల పై పార్లమెంటు ప్రాంగణంలో మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం తో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ రోజు నిరసన తెలిపారు. నేను ఉల్లిపాయలు తినను అని ఆర్థిక మంత్రి నిన్న పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల పై , ఆమె ఏమి తింటుంది?, ఆమె అవోకాడో తింటుందా? ఆమె ఉల్లిపాయలు తినదు, ఉల్లి దరల పెరుగుదల పై ఆమెకు బాధ పడాల్సిన అవసరం లేదు అని చిదంబరం మీడియాతో అన్నారు.
ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం తీసుకుంటున్న కీలక చర్యల గురించి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వివరించిన ఒక రోజు తరువాత చిదంబరం ఈ వ్యాఖ్యలను చేసారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభం గురించి ప్రతిపక్ష ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు, ఉల్లి దిగుమతులతో సహా ధరలు బాగా పెరగడాన్ని తనిఖీ చేయడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుందని అన్నారు.
2019-20 సంవత్సరానికి నిధుల కోసం మొదటి బ్యాచ్ అనుబంధ డిమాండ్లపై చర్చకు సమాధానమిస్తున్న సీతారామన్, ఉల్లి ధరల పెరుగుదల సాగు మరియు ఉత్పత్తి విస్తీర్ణం తగ్గడం వంటి కారణాల వల్ల జరిగిందని అన్నారు. సీతారామన్ బుధవారం ఆమె ఉల్లిపాయ లేదా వెల్లుల్లి ఎక్కువగా తినదాని , ఈ రెండు కూరగాయలు ఎక్కువగా ఉపయోగించని కుటుంబానికి చెందినవారని చెప్పారు. ఉల్లిపాయ సమస్యపై ఆమె మాట్లాడుతున్న సమయంలో కొంతమంది ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆటంకాలపై స్పందిస్తూ వ్యక్తిగత ఆహారపు అలవాట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవి. నేను ఉల్లిపాయ-వెల్లుల్లి ఎక్కువగా తినను. నేను ఉల్లిపాయతో పెద్దగా సంబంధం లేనటువంటి కుటుంబం నుండి వచ్చాను అని ఆమె చెప్పారు.
ఈ రోజు ఉల్లిపాయ ధర చాలా ఎక్కువగా ఉంది, మీరు ఉల్లిపాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే, మీకు ఆదాయపు పన్ను నోటీసు లభిస్తుంది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఉల్లిపాయ ధరలన్నీ ఆకాశాన్ని తాకుతున్నాయి అని ఆయన చెప్పారు.