ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన యువ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు పై ప్రజలు సహా పలువురు సినిమా మరియు రాజకీయ నాయకులు  సైతం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కొద్దిరోజులుగా దిశా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పలువురు సినీ, రాజకీయ నాయకులు వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్తున్నారు. ఇకపోతే ఈ దారుణ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 

 

దిశా ఘటన నిందితులను ఉరి తీయడం కంటే వారిని నాలుగు దెబ్బలు కొట్టడం బెటర్ అని మాట్లాడడం జరిగింది. అయితే పవన్ చేసిన ఆ వాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఆయన వ్యాఖ్యలపై నేడు నాగబాబు కొంత ఫైర్ అవుతూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు. నాగబాబు మాట్లాడుతూ, తన తమ్ముడు పవన్ కళ్యాణ్, దిశా ఘటన హత్యోదంత నిందితులను ఉరి తీయకుండా కేవలం బెత్తంతో కొట్టి వదిలేయమని ఎక్కడా చెప్పలేదని, కాకపోతే కుర్రాళ్లు యుక్త వయసులో ఉన్నపుడు, అమ్మాయిల పట్ల కొద్దిగా తప్పుగా ప్రవర్తించినట్టు తెలిస్తే వారిని అప్పుడే బెత్తంతో గట్టిగా దండించాలని, 

 

అలా చాలామంది తల్లితండ్రులు చేయకపోవడం వలన, అటువంటి యుక్త వయసులో ఉన్న యువకులే నేడు దిశా పై ఎంతో క్రూరంగా అత్యాచారం చేసి ఆమెను హత్య చేసారని, అయితే అటువంటి వారికి మాత్రం ఉరే సరని అందరి మాదిరిగా పవన్ కూడా వ్యాఖ్యానించారని నాగబాబు వివరణ ఇచ్చారు. కాగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను మీడియా సహా పలువురు రాజకీయ నాయకులు సైతం తప్పుగా అర్ధం చేసుకుని ఆయనపై అనవరరంగా నిందలు వేస్తున్నారని, తమకు కూడా సమాజం పట్ల మరియు ఆడపిల్లల పట్ల ఎంతో గౌరవం ఉందని నాగబాబు ఆవేదనతో మాట్లాడుతూ చెప్పారు. కాగా నాగబాబు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విరివిగా వైరల్ అవుతోంది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: