భార‌త దేశ వ్యాప్తంగా ఎంతో మంది హృద‌యాల‌ను బాధ‌పెట్టిన హైద‌రాబాద్‌కు చెందిన వెట‌ర్నరీ డాక్ట‌ర్ దిశ హ‌త్య కేసులో నిందితుల‌ను పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేసేశారు. వాస్త‌వంగా చెప్పాలంటే ఎంతో మంది ఈ కేసులో దిశ నిందితుల‌ను ఉరి వేయ‌డ‌మే క‌రెక్ట్ అని చెప్పారు. మ‌రి కొంద‌రు అయితే అంత‌కు మించి శిక్ష వేస్తే త‌ప్పా దిశ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని.. వాళ్ల‌ను అత్యంత క‌ఠినంగా శిక్షిస్తేనే దిశ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని.. ఎంతో మంది అమ్మాయిలు ఇలాంటి హ‌త్యాచారాల‌కు గుర‌వుతున్నార‌ని.. రేపు వాళ్ల‌పైఈ త‌ర‌హా అత్యాచారాలు చేయాలంటేనే కామాంధులు భ‌య‌ప‌డేలా ఆ శిక్ష ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకున్నారు.

 

ఏదేమైనా దిశ విష‌యంలో ఎంతో మంది ప్ర‌జ‌లు కోరుకున్న‌ట్టుగానే నిందితులు ఎన్ కౌంట‌ర్ అయ్యారు. మ‌రి ట్విస్ట్ ఏంటంటే దిశ ఘటన జరిగిన స్థలంలోనే కామాంధులు ఎన్‌కౌంటర్ గురయ్యారు. అంటే దిశ ఆత్మ‌కు కొంత వ‌ర‌కు ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్ల‌య్యింది. ఇంకా చెప్పాలంటే ఈ సంఘ‌ట‌న‌తో ఎంతో మంది దిశ లాంటి అమ్మాయిలు త‌మ బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో లోలోప‌ల ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లంద‌రికి ఓ మ‌నోధైర్యం వ‌చ్చింది. నాడు వ‌రంగ‌ల్ లో ప్ర‌ణీత పై యాసిడ్ దాడి సంఘ‌ట‌న‌లో ఉన్న నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసిన స‌జ్జ‌నారే నేడు కూడా దిశ నిందితుల‌ను చిత్తు గా ఎన్‌కౌంట‌ర్ చేసి ప‌డేశాడు.

 

నాడు ప్ర‌ణీత ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో ఆ నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయడంతో చాలా రోజులు ఆ ప్ర‌భావం ఉంది. ఎవ‌రైనా అమ్మాయిల‌పై ఆ త‌ర‌హా దాడులు చేయాలంటేనే భ‌య‌ప‌డ్డారు. అయితే ఆ సంఘ‌ట‌న జ‌రిగి ప‌దేళ్లు అయ్యింది. మ‌ళ్లీ ఇప్పుడు దిశ పై జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో యావ‌త్ దేశం అంతా ఉలిక్కి ప‌డింది. ఇక ఇప్పుడు ఈ ఎన్‌కౌంట‌ర్‌తో కూడా కామాంధులు ఈ త‌ర‌హా దాడులు, అత్యాచారాలు చేయాలంటేనే కొన్ని రోజులు అయినా భ‌య‌ప‌డ‌డం ఖాయం. ఇక ఇప్పుడు ఎంతో మంది దిశ లాంటి అమ్మాయిలు లైంగీక దాడుల‌కు గుర‌వుతున్నారు... గురైన వాళ్లు ఉన్నారు. వారికి స‌త్వ‌ర న్యాయం జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇందుకోసం ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ట్టాలు రూపొందించాల్సి ఉంది. అలాగే వెలుగు లోకి రాని మృగాళ్ల‌ను శిక్షించి.. వెలుగులోకి రాని ఆ బాధిత అమ్మాయిల‌కు న్యాయం చేయాల్సి న అవ‌స‌రం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: