దిశ హత్య ఘటన లోని నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు ప్రముఖులంతా జై జై లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటులు చాల సంతోషపడుతూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

మంచి మనసున్న మంచు మనోజ్ ఈమధ్య దిశ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించారు. అప్పటి తన మాటల్లో కూడా ఎంతో ఆవేదన మనం చూడవచ్చు. అయితే ఈరోజు నలుగురు ఎన్కౌంటర్ కి గురయ్యారనే వార్త విన్న తర్వాత మంచు మనోజ్ ట్వీట్ చేసారు.


"ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!" హీరో మంచు మనోజ్ ఇలా పేర్కొన్నారు.

నటుడు శ్రీకాంత్... 'నౌ రెస్ట్ ఇన్ పీస్ దిశ. హాట్స్ ఆఫ్ టూ పోలీస్"

నటుడు నాగార్జున... ' పొద్దున లేవగానే ఈ న్యూస్ యే తెలిసింది. న్యాయం జరిగింది. '

లావణ్య త్రిపాఠి.. ' న్యాయం జరిగింది. #RIP దిశ"

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ' న్యాయం జరిగింది. రెస్ట్ ఇన్ పీస్ దిశ'

ఇంకా చాలా మంది యాక్టర్లు తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చేయడం వలన బయట ఉన్న కామాంధుల వెన్నులో వణుకు పుడుతుందని అంటున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సీపీ సజ్జనార్ ను ప్రశంశల వర్షంలో ముంచెత్తుతున్నారు. నిందితులను ఘోరంగా కాల్చినట్లు చంపినట్లు సమాచారం. దిశ ఆత్మ ఈ ఎన్కౌంటర్ తో శాంతిస్తుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మా అక్క, మా చెల్లి, మా బిడ్డ అంటూ దేశ వ్యాప్తంగా ఎంతో సపోర్ట్ చేసిన ప్రతి అన్నకు, తమ్ముడికి, బాబాయ్ కు నా ధన్యవాదములని దిశ చెల్లి చెప్పింది. ఈ ఎన్కౌంటర్ తో తన గుండెలోని బాధ కొంచెం తగ్గిందని దిశ తల్లి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: