దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. దిశ హత్యాచారం కేసులో జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో అదే ప్రదేశంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.

 

చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఎన్‌ కౌంటర్ జరిగింది. తెల్లవారు జామున 3 నుంచి 5.30 గంటల ప్రాంతంలో ఎన్‌ కౌంటర్ జరిగినిట్టు సమాచారం. హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ 'దిశ' హత్యాచారం కేసు పోలీసులు చేసింది తప్పు అని వారిని బహిరంగంగా రాళ్లతో దాడి చేసి చంపాల్సింది అని మహిళాలు అంటున్నారు. అంత్యంత కిరాతకంగా ఆమెను అత్యాచారం చేసి హత్య చేసిన వైనం మనసున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. 

 

ఈ హత్యపై అటు రాజకీయ నాయకులు.. ఇటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. అంతేకాకుండా.. గత కొద్ది రోజులుగా.. ఈ నలుగురు నిందితులను ఉరి తీయాలని.. ప్రజలందరూ పెద్ద ఎత్తున.. నిరసనలు, ర్యాలీలు చేశారు. అయితే అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉండగా యాసిడ్ అటాక్ నిందితుల్ని కూడా ఎన్‌కౌంటర్ చేశారు.

 

అయితే ఆ నిందితులను చంపడంతో దేశమంతా హర్షం వ్యక్తం చెయ్యగా ఆ రేపిస్టుల తల్లిదండ్రులు మాత్రం తీవ్రంగా స్పందించారు. పోలీసులు అన్యాయంగా తమ కొడుకులను చంపేశారని, కావాలనే చంపేసి ఎన్కౌంటర్ జరిగింది అని అబద్దం చెప్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిందితులకు కోర్టులు శిక్షలు విధించాలి కానీ ఇలా అన్యాయంగా చంపేస్తే ఇక న్యాయం ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. చంపేసే ఉద్దేశ్యంతోనే తెల్లవారుజామున సీన్ రికరెక్షన్ పేరుతో పోలీసులు నాటకం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తమ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: