దిశ కేసు రేపిస్టుల ఎన్ కౌంటర్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులు తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా విపరీతంగా చర్చనీయాంశమైంది. దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ పై నిర్భయ తల్లి స్పందించారు. హైదరాబాద్ పోలీసుల తీరుపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. దిశ తల్లిదండ్రులకు కేవలం వారం రోజుల్లోనే న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.

 

అదే సమయంలో తన కూతురికి ఇంకా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్ల నుంచి తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని.. న్యాయం కోసం పోరాడుతున్నానని ఆమె ఆవేదనగా చెప్పారు. దిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నిర్భయ తరహాలోనే దేశంలో అత్యాచారం, హత్యలకు గురయిన ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఈ ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇక దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ పై దిశ దిశ కుటుంబం కూడా స్పందించింది. ఇంత త్వరగా న్యాయం జరుగుతుందని తాము ఊహించలేని వారు అంటున్నారు. ఈ ఎన్ కౌంటర్ తోనైనా.. దిశ ఆత్మకు కాస్త శాంతి దొరుకుతుందని దిశ ఫ్యామిలీ చెబుతోంది. కానీ ఇలా ఎన్ కౌంటర్ చేస్తారని ఊహించలేదన్నారు. దిశ చెల్లి స్పందిస్తూ.. ఈ ఘటనలో తాము ఊరి శిక్ష పడుతుందని.. వారిని త్వరగా ఉరి తీస్తారని అనుకున్నాం.. ఈ ఎన్ కౌంటర్ తోనైనా ఓ మార్పు రావాలని కోరుకుంటున్నా అన్నారు. ఇంకా దిశ లాంటి ఘటనలు రిపీట్ కాకూడదని ఆశించారు. ఇది ఒక గుణపాఠంగా ఉంటుందన్నారు.

 

అయితే తాము ఎన్ కౌంటర్ చేస్తామని ఊహించలేదన్నారు. గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: