హైదరాబాద్కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం కేసులో నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం పై దేశవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు పలువురు సినిమా, పారిశ్రామిక, రాజకీయ రంగాలకు చెందిన వారంతా స్పందిస్తున్నారు. చివ‌ర‌కు పార్ల‌మెంటును సైతం ఈ విష‌యం ఓ రేంజ్‌లో కుదిపేసిన సంగ‌తి తెలిసిందే.

 

దిశ పై అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష కరెక్ట్ అని చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ రోజు సోషల్ మీడియా వేదికగా తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం దిశపై హత్యాచారం జరిపిన నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, న్యాయం జరిగింది. ఇక దిశ ఆత్మ శాంతిస్తుంది అని వ్యాఖ్యానించారు.

 

ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ను చూస్తే ఆయ‌న ఎంతో భావోద్వేగంతో స్పందించిన ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్‌తో పాటు మ‌రి కొంద‌రు సినిమా ప్ర‌ముఖులు కూడా త‌మ స్పంద‌న తెలియ జేస్తున్నారు. అమ్మాయిలపై ఇలాంటి దాడి చేయాలంటే మరొకరు భయపడేలా చేశారని దిశ తండ్రి వ్యాఖ్యానించారు. సజ్జనార్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అటు దిశ త‌ల్లి కూడా త‌మ కుమార్తె కు జ‌రిగిన ఘోర‌మైన అన్యాయం మ‌రో వ్య‌క్తికి జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నానంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

ఈ కేసు కోర్టు ద్వారానే తేలుతుందేమో అనుకున్నామని… కానీ ఇలావెంటనే న్యాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ తెల్లవారుజామున తమ కస్టడీలో ఉన్న నిందితులను ఘటనా స్థలికి పోలీసులు తీసుకువెళ్లిన సమయంలో వారు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో నిందితులంతా హతులైన సంగతి తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: