దిశ రేపిస్టులు ఎన్ కౌంటర్ పై దేశమంతటా హర్షం వ్యక్తమవుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ ఎన్ కౌంటర్ పై రాజకీయ నాయకులు, టాలీవుడ్ నటలు, బాలీవుడ్ నటులు..ఇలా అన్ని వర్గాల వారు కూడా స్పందిస్తున్నారు. ఇక ఈ విషయంపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంకాస్త వెరైటీగా స్పందించారు.

 

ఆమె దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ఆమె ఏం పోస్టు చేశారంటే.. “ పరిత్రాణాయ సాధూనాం.. వినాశాయ చ దుష్కృతామ్.. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే.. అంటూ ట్వీట్ చేశారు. నేరుగా దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ గురించి ప్రస్తావించుకుండా భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేశారు.

 

లోకం పాపం పెరిగిపోయినప్పుడు.. దుష్ట సంహారం కోసం.. ధర్మాన్ని రక్షించేందుకు భగవంతుడు ప్రతి యుగంలోనూ జన్మిస్తాడనేది దీని సారాంశం.. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా ఆమె తెలంగాణ పోలీసులను ఆకాశానికెత్తేసినట్టయింది. హైదరాబాద్ పోలీసులను ఆమె ఏకంగా భగవంతుడితో పోల్చేశారు. కాస్త ఎగ్జాగరేషన్ గా అనిపిస్తున్నా.. ఈ పోలిక సబబేనంటున్నారు జనం. ఇక రాజకీయ నాయకులే కాదు.. దేశమంతటా ఈ ఎన్‌ కౌంటర్ పై హర్షం వ్యక్తమవుతోంది. శభాష్ తెలంగాణ పోలీస్ అంటున్నారు జనం.

 

ప్రత్యేకించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో అభినందన వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది. సెలబ్రెటీలు మొదలుకుని.. సామాన్యుల వరకూ దిశకు సత్వరమే న్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఆ మేరకు పోస్టులు పెడుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో సమాజంలో కీచకుల దాడికి బలైన వారికి సత్వర న్యాయం చేస్తారన్న భరోసా ఇచ్చారంటోంది మహిళాలోకం. సజ్జనార్ ఈజ్ రియల్‌ లైఫ్‌ సింగం అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: