దిశ నిందితుల అత్యాచార , హత్య నిందితుల్ని శుక్రవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి . టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పట్ల హర్షం వక్తం చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు . నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ ఉరికి ఒక్కడే రౌడీ ఉండాలి ...  వాడు పోలీసోడై ఉండాలి అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది . మరికొందరు సినీ హీరోలు స్పందిస్తూ న్యాయం జరిగిందని , ఐ లవ్ యూ తెలంగాణ పోలీసు అంటూ  సోషల్ మీడియా వేదికగా స్పందించారు .

 

 ఈ భయం చాల అవసరం అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొనగా , మృగాళ్ళని సరైన దిశ లో వేటాడిన మగాళ్లు అంటూ బన్నీ వాసు వ్యాఖ్యానించారు . ఇలా టాలీవుడ్ ప్రముఖులు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తమదైన శైలి స్పందిస్తూ , పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు .  దిశ అత్యాచార , హత్య ఘటన నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయడం పట్ల విజయవాడ లోని సిద్ధార్థ కాలేజీ  విద్యార్థినులు బ్యాండ్ వాయిస్తూ , నృత్యం చేస్తూ తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు .

 

ఇక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత , బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ రాముడ్ని , కృష్ణుడి ని పూజించడం కాదని , ఈ యుగంలోనూ ఆ అవతారాలు ఎత్తాల్సిందేనని అన్నారు . త్రేతాయుగం లో రావణుడు , ద్వాపర యుగం లో దుశ్శాసనుడు మన ఆడబిడ్డలను మాత్రమే ఎత్తుకెళ్లారని , కానీ నేటి యుగం లో మన ఆడబిడ్డలను సీత , ద్రౌపదిలను ఎత్తుకెళ్ళి సామూహిక అత్యాచారం చేసి తగులబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . దిశ కు ఇప్పుడే న్యాయం జరిగిందని , ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: