దిశ పై అతిఘోరమైన రీతిలో అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసిన నిందితులకు చివరికి జరగాల్సిన శాస్తి జరిగిందని జనమంతా ఆనందంతో ఉండగా ఇప్పుడు ఆ ఎన్ కౌంటర్ గురించి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాలకు దగ్గర సరిగ్గా వారు ఆమెను ఎలా చిత్రహింసలకు గురిచేశారో తెలుసుకొని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టేందుకు అక్కడకు వెళ్లగా ఒక్కసారిగా నలుగురు నిందితులు ప్లాన్ ప్రకారం ఒక పోలీసు దగ్గర ఉన్న రివ్వాల్వర్ సినీఫక్కీలో తీసుకొని వారిపై దాడి చేయడం ప్రారంభించాడు.

 

ముందు పోలీసులు అతని చేతిలో ఉన్న గన్ ను కింద పడేయమని ఆదేశించారు. కానీ వారు వినకుండా ఉన్న ఒక రివాల్వర్ తోనే పోలీసులను బెదిరించడం మొదలు పెట్టారు. మమ్మల్ని తప్పించుకోనివ్వకపోతే మీ అందరినీ చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో పోలీసు వారు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరపడంతో ఒక పోలీస్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ఇక ఏ అవకాశం లేని సమయంలో పోలీసులు తమ ఆత్మ రక్షణకై వారిపై కాల్పులు జరిపారు.

 

ముందు చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉన్న వాడితో పాటు పరిగెడుతున్న ఇద్దరిని వెనకనుంచి కాల్చుతుండగా అతను తిరిగి వారిపై దాడి చేయడంతో ఇక వారు మొదట అతనిని కాల్చి చంపేశారు. దీంతో ఉద్రేకంతో మిగతా ముగ్గురు కూడా వారిపై ఎదురుదాడికి దిగడంతో పోలీసులు ఇక వేరే ఆలోచన లేకుండా తమను తాము కాపాడుకునేందుకు ఎన్ కౌంటర్ లో ముగ్గురిని వరుసగా టపా టపా పేల్చి పారేశారు. చివరికి ఎక్కడైతే వారు దిశ పై ఆ దారుణానికి ఒడిగట్టారో అక్కడే వారు కుక్క చావు చచ్చినట్లు అయింది.  అయితే ఈ సంఘటన స్థలంలో ఒక పోలీసుకి స్వల్ప గాయాలు కాగా మిగతా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: