రాక్షసుల్లాంటి  నలుగురు మృగాళ్లు  అమాయకురాలైన ఆడపిల్లను అతి కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాక్షసులకు ఉరి శిక్ష విడిస్తే దిశాకు  న్యాయం జరగి ఆత్మకి శాంతి చేకూరుతుందని  దేశ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దిశ కేసు నిందితులను వదిలి  పెట్టకుండా  ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.మీరు  చంపకపోతే ఆ కామాందులను మాకు అప్పగించండి మేము  చంపేస్తాం అని దేశ  ప్రజానికం ఆగ్రహం తో ఊగిపోతున్నారు . దిశా  తల్లిదండ్రులు కూడా... మా కూతురు కి వచ్చిన పరిస్థితి ఇంకొకరికి రాకూడదని నిందితులను  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.  

 

 

 

 ఎట్టకేలకు దిశా ఆత్మకు శాంతి చేకూరింది . ఆమాయకురాలైన వైద్యురాలు దిశాను  దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపారు  పోలీసులు. అయితే ఈనెల 4వ తేదీన చర్లపల్లి జైలు నుంచి నిందితులను పోలీసులు  కస్టడీలోకి  తీసుకున్నారు . కేసు రికన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు  పారిపోయేందుకు ప్రయత్నించడంతో   ఎన్కౌంటర్ చేసామని తెలిపారు. నలుగురు రేపిస్టులను ఎన్కౌంటర్ చేయడంతో దేశ ప్రజలందరూ హర్షద్వానాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాహో సీపీ సజ్జనార్  అంటున్నారు .ఆడ పిల్లలపై చేయి  వేస్తే కఠిన శిక్షలు పడతాయని మరోసారి నిరూపించారు  ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి . 

 

 

 

 అయితే ఈరోజు ఉదయం 3 గంటల 40 నిమిషాలకు పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టు బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పటినుంచి... ఆ రాక్షసులను పోలీసులు ఎలా ఎన్కౌంటర్ చేసారు అని... వీడియో కోసం నెట్లో తెగ వెతికే చేస్తున్నారు అందరు. అలాంటి క్రూరమైన మృగాలను పోలీసులు ఎలా ఎంకౌంటర్ చేసారో  ఒక్కసారి చూడాలని ఆత్రుత చూపిస్తున్నారు ప్రజలు . దీంతో సోషల్ మీడియాలో ఎన్కౌంటర్ వీడియో కోసం వెతకడం మొదలుపెట్టాడు. దిశా ఘటనలో  నిందితుల ఎంకౌంటర్ వీడియో కోసం చాలా వెతికారు. ఇదిలా ఉండగా... దిశా  కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపడంతో మరోసారి సీపీ సజ్జనార్ పై మహిళా లోకం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: