దేశవ్యాప్తంగా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ  అత్యాచారం హత్య ఘటన లో నిందితులను శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ పోలీసులు ఏ ప్రదేశంలో నిందితులు అత్యాచారం చేయడం జరిగిందో అదే ప్రాంతంలో వారిని ఎన్‌కౌంటర్‌ చేయడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు వివిధ పార్టీల రాజకీయ నేతలు దిశ కి సరైన న్యాయం చేశారని సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. కొంత మంది సెలబ్రిటీలు అయితే మరొకసారి ఇటువంటి ఘటనలు దేశంలో జరగకుండా హైదరాబాద్ పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ సమాజంలో మార్పులు తీసుకు రావడం గ్యారెంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీస్ ఆఫీసర్ విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు. గతంలో వరంగల్ ప్రాంతంలో విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ ఆధ్వర్యంలో నే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాసిడ్ దాడి జరిగిన ఘటనలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సదరు నలుగురు నిందితులను విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ ఎన్‌కౌంటర్‌ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా దిశ నిందితులను అదేవిధంగా వరంగల్ తరహాలోనే నిందితులు విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ ఆధ్వర్యంలో ఎన్‌కౌంటర్‌ చేయడంతో విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హీరో అయిపోయాడు.

 

దీంతో కర్ణాటకలో విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ సొంత ఇంటి దగ్గర సంబరాలు అంబరాన్ని అంటాయి. అక్కడ ఉన్న చాలా మంది స్థానికులు విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ ఇంటి ముందు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది అయితే స్వీట్లు కూడా పంచడం జరిగింది. మొత్తం మీద విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో దేశవ్యాప్తంగా పెద్ద హీరో అయిపోయాడు. ఈ క్రమంలో కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులకు డబ్బులు నజరానా ప్రకటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: