ఇప్పుడు గత కొన్ని రోజుల కితం దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి లోనయ్యిన వారు అంతా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు తెల్లవారుతూనే దిషా ను హత్యాచారం చేసి చంపేసిన నలుగురు హంతకులని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ లో చంపేశారు అని వచ్చిన వార్త ప్రతీ ఒక్కరి కళ్ళల్లో ఆనందం నింపింది. అయితే ఇప్పటికే ఈ ఎన్‌కౌంటర్ పై ప్రతీ ఒక్కరి కళ్ళల్లో ఆనందం నింపింది. అయితే ఈ సంచలన సంఘటనుకు టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ రచయిత పరోక్షంగా స్క్రిప్ట్ ఇచ్చారని దాని ప్రకారమే ఈ ఎన్కౌంటర్ జరిగిందని నెటిజన్స్ అంటున్నారు.

 

ఇంతకీ అది ఎవరో కాదు టాలీవుడ్ లో  ఎందరో అగ్ర శ్రేణి హీరోల సినిమాలకు రైటర్ గ వహించిన కోనా వెంకట్. తాజాగా కోనా తెలంగాణలో జరిగిన ఈ సంచలన ఘటనను ఉద్దేశించి “దేవుడు ఉన్నదో లేదో తెలీదు కానీ తెలంగాణాలో మాత్రం పోలీస్ రూపంలో ఉన్నాడు” అని ట్వీట్ చెయ్యగా దాని కింద అసలు ఈ ఎన్‌కౌంటర్ కు స్క్రిప్ట్ రాసిందే మీరంటు ఆయన ఫాలోవర్ ఒకరు ఒక ఫొటోతో చిన్నగా చమత్కరించారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే మీరు ఒకవేళ ఆ నిందితులను శిక్షించాలి అంటే వారందరిని దిషా ను ఎక్కడైతే హతమార్చారో అక్కడే చంపెయ్యండి అని కేటీఆర్ పెట్టిన ట్వీట్ లో పెట్టారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అలాగే జరిగింది. మొత్తానికి ఈ ఘటనకు కోనా వెంకటే స్క్రిప్ట్ రాసారని చిన్న వింతైన ప్రచారం జరుగుతుంది.

 

మన దేశంలో ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ‘దిశ’ ఉదంతం చట్టాలు సరిపోవని ‘దిశ’ ఘటన హెచ్చరిస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకున్న విధంగా ఈ ఘటనలో సత్వర న్యాయం జరిగిందని అన్నారు.  ‘ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని అనుభవించిందో తలుచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోంది. జాతి యావత్తూ తక్షణ న్యాయం కోసం కోరుకోవడానికి ఈ ఘటన తీవ్రతే కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: