ఈ కాలంలో ఒక్క పెళ్లాన్ని చేసుకుని భరించడమే కష్టం కాని ఇద్దరు పెళ్లాలని చేసుకుని ఏం సుఖపడుదామనుకున్నాడో ఏమో తెలియదు. ముచ్చటగా ఇద్దరిని చేసుకుని తన చావును తానే తెచ్చుకున్నాడు. ఆ వివరాలు తెలుసుకుంటే మద్యానికి బానిసై రోజు కుటుంబసభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్న రాజు వాగ్మేర్ అనే వ్యక్తిని గురువారం రోజున తన ఇద్దరు భార్యలు పథకం ప్రకారం హతమార్చారు. ఈ దారుణం దేశవాణిజ్య రాజధాని ముంబైలోని గోరెగావ్‌లో  చోటుచేసుకుంది.

 

 

ఇకపోతే 2006లో రాజు సవితను వివాహం చేసుకోగా.. సరితను 2010లో వివాహం చేసుకున్నాడు. ఇక సవితకు ముగ్గురు పిల్లలు కాగా.. సరితకి ఒక సంతానం. ఇక ఒకే ఇంట్లోనే రాజు వాగ్మేర్ తన ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్న వాగ్మేర్‌ గతకొద్ది రోజులుగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చొని రోజు మద్యం తాగుతూ గడిపేవాడు. ఈ క్రమంలో భార్యలిద్దరినీ, పిల్లలను వేధింపులకు, హింసకు గురిచేస్తుండటంతో వారు భర్త ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఇతని భార్యలు. ఎలాగైనా రాజును హతమార్చాలని పథకం వేశారు.

 

 

ఈ క్రమంలో సరిత, సవిత గురువారం అర్ధరాత్రి భర్తను హతమార్చడానికి అనువైన సమయంగా ఎంచుకున్నారు. ఇందుకు గాను పధకం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ పధకాన్ని అమలుచేసారు..మద్యం మత్తులో ఉన్న రాజును మంచం మీద పడుకోబెట్టి అతి దారుణంగా దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసారు.

 

 

దీంతో కొద్ది సేపటిలోనే అతను మృతి చెందాడు. వెంటనే వారు తమకేమీ తెలియనట్టు.. రాజు స్పందించడం లేదని మృతుడి అన్న వినోద్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న వినోద్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో వైద్యులు అతను మరణించాడని తెలిపారు. దీంతో అతని తమ్ముని మరణం పై అనుమానం వచ్చిన వినోద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడం తో విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు భార్యలు కలిసి హతమార్చారని తెలిసింది. వారిని అరెస్టు చేయడంతో పాటు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: