దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుల కథ నిన్నటితో ముగిసింది. పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయిస్తుండగా నిందితులు ఒక్కసారిగా పోలీసులపై దాడికి పాల్పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు. నిందితులను ఎన్‌కౌంటర్‌లో చంపిన పోలీసులకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. 

 

ఇక అటు నిందితుల కుటుంబ సభ్యులు ఎన్‌కౌంటర్‌పై విచిత్రంగా స్పందించారు మీడియా ప్రతినిధులు దిశ హత్య కేసులో రెండవ నిందితుడు అయిన చెన్నకేశవులు ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని మీ అబ్బాయి ని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపారు ఏం అంటారు అని అడుగగా "మా పిలగాడిని చంపినందుకు సంతోషంగా ఉంది, బాగారా అన్నం చేసుకుని తిన్నాం, బాగా చంపిర్రు మా పిలగాడిని" అని చెప్పింది. మీ అబ్బాయి ని చంపినందుకు మీకు కోపం ఉండడం సహజమే కానీ మీరు అటువైపు నుంచి కూడా ఆలోచించాలి కదా అని ప్రశ్నించగా "కోర్టు 10 దినాలు టైం ఇచ్చిందిగా, కోర్టులో మా పిలగాడిని విచారించకుండా ఇలా చంపడమేంది, ఒక్కసారి చివరి చూపు కూడా చూసుకోలేదు మా బిడ్డని, చివరి చూపుగా నా బిడ్డ ముఖాన్ని నాకు చూపిస్తే బాగుండేది కదా" అని ప్రశ్నించారు చెన్నకేశవులు తల్లి. 

 

నా కోడలు గర్భవతి చిన్నతనంలో పెళ్లి చేసుకున్నారు నా కొడుకు, కోడలు. ఇప్పుడు నా కోడలు పరిస్థితి ఏంటో మీరే చెప్పండి. మా పిలగాడిని కోర్టు ఉరి తీస్తే ఇంత బాధ పడేవాళ్ళం కాదు అని చెన్నకేశవులు తల్లి చెప్పింది. ఇక చెన్నకేశవులు భార్య "మా ఆయన్ని చంపిన చోటే నన్ను చంపండి అంటూ ఉద్వేగంతో చెప్పింది" చెన్నకేశవులు చేసిన దుర్మార్గమైన పని వల్ల ఒక అమాయక కుటుంబం రోడ్డున పడింది. మృతుడి భార్య మూడు నెలల గర్భవతి అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: