వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే దిశ ఘటనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

  

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''రేప్ చేస్తే ఉరి తీస్తారా? రెండు బెత్తం దొబ్బలు కొడితే చాలని ‘తీర్పు’ చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి. తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నాడు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబ్తుండటం దురదృష్టం.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

నీకు ఒక న్యాయం.. మరో ఆడపిల్లకు ఒక న్యాయమా ? రేపే చేస్తే రెండు బెత్తం దెబ్బలు చాల ? ఇదా నువ్వు ఇచ్చే తీర్పు ? ఈ తీర్పు చెప్పిన నీకు నానా సానుభూతి అంటూ విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రెండు బెత్తం దెబ్బలు చాలు అంటే ఇప్పుడు ఈరోజు వారు ఎన్కౌంటర్ కు గురయ్యేవారు కాదు అంటూ నెటిజన్లు కూడా పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: