దేశంలో నిన్న ఉదయం తెలంగాణ పోలీసులు దిశ అత్యాచారం హత్యకు సంబంధించిన నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో చాలా మంది సినిమా సెలబ్రిటీలు మరియు అదే విధంగా వివిధ పార్టీల రాజకీయ నేతలు ఇక రానున్న రోజుల్లో ఆడదాని పై అత్యాచారానికి పాల్పడటానికి మగవాళ్ళు రూపంలో ఉన్న మృగాలు భయపడతారు అన్న విధంగా నిన్న తెలంగాణ పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ పట్ల చాలామంది కామెంట్ చేయడం జరిగింది. అయితే ఎన్ కౌంటర్ జరిగి 24 గంటలు గడవకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో మద్యం మత్తులో ఉన్న టాటా మ్యాజిక్ డ్రైవర్ చాలా దారుణంగా ఎనిమిదవ తరగతి చదువుతున్న ముక్కుపచ్చలారని ఆడపిల్ల పై అత్యాచారానికి పాల్పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో అందరిని భయాందోళనలకు గురి చేస్తోంది.

 

లిఫ్ట్ ఇస్తానంటూ సదరు లారీ డ్రైవర్ 8వ తరగతి చదువుతున్న ఆడపిల్ల పై అత్యాచారానికి పాల్పడటం కోసం దారి మళ్ళించి వ్యవహరించడంతో సదరు ఆడపిల్ల కేకలు వేయడం చుట్టుప్రక్కల ఉన్న జనం వెంటనే సదరు లారీ డ్రైవర్ ని పట్టుకుని అక్కడికి అక్కడే దేహశుద్ధి చేయడం జరిగింది. ఎవరికి వారు వెంటనే ఆ మృగం నుండి ఆడపిల్లని కాపాడి లారీ డ్రైవర్ ని పట్టుకొని పబ్లిక్ మొత్తం కొట్టడం జరిగింది. దీంతో ఈ వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీడియాలో సంచలనం అయింది. అసలు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ఏంటని పోలీసులు ఏం చేస్తున్నారని జనం మండిపడుతున్నారు.

 

పైగా దిశ మరియు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనలు బట్టి చూస్తే మగవాడు మద్యం తాగి మృగం లాగా వ్యవహరిస్తున్నాడని లారీ తోలుతున్న వాళ్లకి మద్యం ఎక్కడినుంచి దొరుకుతుందో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త విన్న చాలా మంది శ్రీకాకుళం జిల్లాలో 8 వ తరగతి చదువుతున్న పిల్లలపై పాల్పడిన వ్యక్తిని కూడా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చేలా ఇంకా కఠినమైన శిక్షలు చట్టాలు రావాలని జనాలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: