దేశం మొత్తం కూడా దిశ హత్యోదంతంతో అట్టుడికిపోయింది. తదనంతర పరిణామాలు, నిందితుల ఎన్ కౌంటర్ సంఘటన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే.. ఈ ఎన్ కౌంటర్ ను తమ సమస్యలకు అన్వయించుకుని వివాదాస్పదం చేయటం కొందరికే సాధ్యమవుతుంది. శ్రీరెడ్డి, పూనమ్ ఇదే చేస్తున్నారు. దిశ హత్యోదంతాన్ని, ఎన్ కౌంటర్ ను పవన్ కల్యాణ్ కు లింక్ చేస్తున్నారు.

 

 

నిరంతరం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి, పూనమ్ కౌర్ దిశ ఘటనను, నిందితుల ఎన్ కౌంటర్ ను తమకు అనుకూలంగా మార్చుకుని కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరి కామన్ శత్రువైన పవన్ కల్యాణ్ కు ఈ ఘటనలను లింక్ చేస్తూ వివాదం రాజేస్తున్నారు. నలుగురు నిందితులు చేసిన రాక్షస పనికే వారిని ఎన్ కౌంటర్ చేస్తే జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన పనికి ఉరి తీయాలని అంటోంది. సమాజంలో రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారిని ఉరి వేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. ఈవిడే అనుకుంటే సినీ నటి పూనమ్ కౌర్ కూడా జత కలిసింది.

 

 

పూనమ్ కౌర్ కూడా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ని పవన్ కల్యాణ్ కి లింక్ చేసి వివాదం రేపుతోంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై సంతోషం వ్యక్తం చేసినంతవరకూ బాగానే ఉంది. దీనికి కొనసాగింపుగా.. హత్యోదంత నిందితులను ఎన్ కౌంటర్ చేసినప్పుడు తనతో పాటు కొంతమంది మహిళలను మోసం చేసిన సినీ, అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నానని పూనమ్ ట్విట్ చేసింది. వాళ్లకి కూడా 'ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు' అని పేర్కొంది. దీంతో తనను మోసం చేసింది పవన్ కల్యాణ్ అనే విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. పూనమ్ వ్యాఖ్యలు నిజమే అయితే ఇన్నాళ్లు ఏం చేసింది.. అనేది ఆమెకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: