నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోలేనంత స్థితిలో నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందన్నారు. నెల్లూరులో అన్ని రకాల మాఫియాలకు అడ్డాగా మారి, మాఫియా  తిరుగు లేకుండా నడుస్తున్నాయని ప్రభుత్వ వ్యవస్థ సరిగా పనిచేయటం లేదని వ్యాఖ్యానించారు. వ్యవస్థల్ని సరిగా పనిచేయనీయడం లేదని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆనం నెల్లూరులో పరిస్థితులు ఏమీ బాగోలేవని అభిప్రాయపడ్డారు.

 

నెల్లూరులో కబ్జా కోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని.. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుంది అన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలి.. ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వెళ్లాలి అంటూ ఎద్దేవా చేశారు. ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరంతో పనిచేసే పోలీస్ అధికారులు ఉన్నా.. ఒక్క అడుగు ముందుకు వేయాలంటే.. వెనక్కు తిరిగి వాళ్ల ఉద్యోగ భద్రతను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

 

అధికారులకు చేస్తామని నమ్మకం ఉన్నా.. చేయలేని పరిస్థితి నెల్లూరులో ఉందన్నారు. శ్రీనివాసులరెడ్డి ఎస్పీగా ఉన్న నెల్లూరులో మాఫియా ఉంది అన్నారు. ఇదంతా నెల్లూరు నగర ప్రజలు చెప్పుకోలేక అల్లాడిపోతున్నారని.. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. నెల్లూరులో ప్రస్తుత పరిస్థితుల్ని మెరుగుపరచాలంటే ఆత్మస్థైర్యం కలిగిన అధికారులు కావాలన్నారు. ‘ఒకవేళ అలాంటి అధికారులు ఉంటే ఉండనీయరు కదా.. అలాంటి అధికారుల్ని ఎమ్మెల్యేలు ఉంచం కదా.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటాం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఏడాది కూడా నెల్లూరులో పనిచేనీయకుండా ఇప్పటికి నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎస్పీలను మార్చేశారని అన్నారు. ‘దీనికి ఏంటి కారణం.. పలుకుబడి.. మా ఎమ్మెల్యేలు.. మరి ఎలా వ్యవస్థలు పనిచేస్తాయి. వ్యవస్థల్ని పనిచేయిస్తేనే ఇలాంటివి ఆగుతాయని అభిప్రాయపడ్డారు. ఆనం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అధికార పార్టీలో ఉన్న ఆనం.. ఇప్పుడు నెల్లూరును టార్గెట్ చేయడంతో ఆసక్తికరంగా మారాయి రాజకీయాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: