జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయ్యింది. ఎక్కడైనా పార్టీ నాయుడుపై వేరే పార్టీ నాయకులూ కేసు పెడుతారు. వేరే పార్టీ నాయకులూ కేసు పెడితే ఏంటి మా నాయకుడుపై కేసు పెడుతున్నావ్ అని ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ ఏంటో అంత రివర్స్.. పవన్ కళ్యాణ్ పై తాజాగా కేసు నమోదయింది. అది కూడా సొంత పార్టీ నాయకులే అతనికి షాక్ ఇస్తూ కేసు పెట్టారు. 

 

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. ఇంకా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ గారు వృత్తిరీత్యా సినిమా హీరో కాబట్టి అయన ఎక్కడికి వెళ్లిన ఆయనకు డైలాగ్స్ వెయ్యడం అలవాటు. ఈ నేపథ్యంలోనే అతను ఈ మధ్యకాలంలో చాలా ప్రసంగాలలో సినిమా హీరోలా డైలాగ్ లు వేస్తున్నాడు అని మొన్న ఈ మధ్యే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ లో ట్విట్ పెట్టారు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే అతని ప్రసంగాలు మతాలను, కులలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారాని జనసేన నాయకుడు అలివర్ రాయ్ అన్నారు. పున్నమి ఘాట్‌లో మత మార్పిడిలు జరుగుతున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య గొడవలు పెట్టెల ఉన్నాయని అయన అన్నారు. కాగా పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసినప్పటికీ పవన్‌లో ఎలాంటి స్పందన రాలేదని అయన అన్నారు.

 

దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది నెటిజన్లు మరి దారుణంగా ఈ కేసుపై స్పందిస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తే మరికొందరు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. అందుకే బాబు దత్తపుత్ర కాస్త చూసుకొని మాట్లాడు అంటూ సంచలన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: