ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా సరే చూసే ప్రోగ్రాం "జబర్దస్త్ ", "ఎక్స్ట్రా జబర్దస్త్ ". ఈ కార్యక్రమంలో  ప్రేక్షకులను నవ్వులతో ముంచేస్తారు ఈ కమీడియన్స్. ఈ కార్యక్రమం ఈటీవీ చానెల్ లో ప్రసారం అవుతుంది. మొదట్లో కేవలం జబర్దస్త్ మాత్రమే ఉండేది. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా రావటంతో ఎంటర్ టైన్మెంట్ ను డబుల్ ఎంటర్ టైన్మెంట్ గా మార్చేసింది.   దీంతో ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువ ఉత్సాహంతో చూస్తున్నారు. ఇప్పటికే  ఎన్నో మైళ్ళ రాళ్ళను అందుకున్న ఈ సెన్సేషనల్ కామెడీ షో జబర్దస్త్ ఇప్పుడు 350 వ ఎపిసోడ్ ను పూర్తి చేసుకోబోతోంది.


ఈ 350 మెగా ఎపిసోడ్ కు ముగ్గురు మెగా మామయ్యల ముద్దుల అల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ గెస్ట్ గా ఈ షోకి వచ్చారు. ఇక ఇక్కడి నుంచి మొదలైంది అసలు రచ్చ.. టీమ్ లీడర్స్ ఇక స్కిట్ లు రెడీ చేసుకుని మేం రెడీ మరి మీరు రెడీ అంటూ... రానే వచ్చారు.  టీమ్ లీడర్స్ అందరూ వారి వారి స్కిట్స్ ను ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కానీ, వీరిలో హైపర్ ఆది స్కిట్ ఎట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం "అత్తారింటికి దారేదీ" స్పూఫ్ తో అదరగొట్టాడు..


ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఈ స్కిట్ లో ఆది సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో కూడా స్కిట్ చేపించారు. ఇక సాయి ధరమ్ తేజ్ స్టేజ్ మీదకి రాగానే స్టేజి దద్దరిల్లింది. విస్సిల్స్, క్లాప్స్ తో మారు మోగిపోయింది.  ఆది ధరమ్ తేజ్ మధ్య కన్వర్సేషన్ ఇంకా అదిరి పోయింది. తర్వాత ఆది నాకు ఈ స్టేషన్ పది నిమిషాలు  కావాలి అన్నప్పుడు శాంతి స్వరూప్ నాకు లైఫ్ లాంగ్ కావాలి అని వేసిన జోక్ అయితే మామూలుగా పేలలేదు.


అలాగే దొరబాబు ను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ కూడా హీలేరియస్ గా పేలింది మరి... ఇంకా ఈ ఫుల్ ఎపిసోడ్ ఇంకెలా ఉంటుందో తెలియాలంటే డిసెంబరు 12 గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు వేచి చూడాల్సిందే మరి... ఏదేమైనా జబర్దస్త్ షోకి ఇప్పుడున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక మీదట ఉంటుందో లేదో చూడాలి మరి... ఈ షో గురించి వాద, ప్రతి వాదనలు ఇండస్ట్రీ లో వినిపిస్తూనే ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: