వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య చేస్తున్న తీరుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''ఒక సినిమాలో హీరోగా మరో మూవీలో విలన్ గా నటిస్తే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ ఒకే సినిమాలో ఆ నటుడు కథానాయకుడిగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. 

 

ఒక సినిమాలో హీరోగా ద్విపాత్రాభినయం చెయ్యవచ్చు కానీ ఒకే సినిమాలో హీరో ల విలన్ లా చెయ్యకూడదు అని చాలా గలీజుగా ఉంటుంది అని, ఆలా చెయ్యడం వల్ల ఆ సినిమాను చూసే ప్రేక్షకులు కూడా చిరాకు పడుతారని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా ట్విట్ చేశారు. ఓ నెటిజన్ ట్విట్ చేస్తూ ''సార్, ద్విపాత్రాభినయం సినిమాల్లో హిట్ అవ్వొచ్చు & కానీ నిజ జీవితంలో అలా ప్రజలు ఒప్పుకోరు. అందుకు ఉదాహరణ గాజువాక & భీమవరం ప్రజలు రెండుచోట్ల గాల్లోకి ఎగరేసి కొట్టారు.!'' అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ ట్విట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: