జీవితాంతం తోడుంటానిని పెళ్లి చేసుకున్నాడు. కాని చెసిన బాసలు మరిచాడు. కట్టుకున్న భార్యను వేధించడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సంగీత లాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. పటాన్ చెరులో భార్య, అత్తమామలపై తన సోదరుడితో కలిసి దాడికి పాల్పడ్డాడు ఓ భర్త.  కట్టుకున్న భార్యనే కాదు అత్తమమాలను సైతం బెల్టుతో చితకబాదాడు. సర్దుకుపోదాం అని కాపురానికి వచ్చిన భార్యని కనికరం లేకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. సహించలేని అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


వివరాల్లోకి వెళితే అనూషకు పటాన్ చెరుకు చెందిన రఘురామిరెడ్డి అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది.  రఘురామిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. పెళ్ళైన కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. ఆతవాత ఏమైందో తెలియదు రఘురామిరెడ్డి అనూషను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. కొన్ని రోజులు అనుష భర్త వికృత చేస్టలు భరించింది. తల్లి దండ్రులకు ఫోన్ చేసి తన బాధనుమొర పెట్టుకునేది.
 

భర్త వేధింపులు మరీ ఎక్కవ అవడంతో అనూష తన పుట్టించికి వెళ్లిపోయింది. తరువాత ఇరు వర్గాల పెద్దలు రాజీ కుదర్చడంతో మళ్లి శనివారం అత్తారింటికి కాపురానికి వచ్చింది. వస్తూ తన  తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చింది. అయితే ఇంట్లోకి అడుగుపెట్టగానే అల్లుడు రఘురామిరెడ్డి అత్తమామలపై విరుచుకుపడ్డాడు. తన పరువు బజారున పెట్టారంటూ నిందిచాడు. అనరాని మాటలు అని అన్నాడు. తాను దాడిచేయడమే కాకుండా తన సోదరుడిని కూడా రంగలోకి దించాడు. ఇద్దరూ కలిసి అనూష, అత్తమామలపై కర్రలతో కొట్టారు. ఆతరువాత రఘరామిరెడ్డి అందరిని మళ్లీ  బెల్టుతో  చితకబాదాడు.


భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా.. తనని కొట్టడం కాకుండా తన తల్లిదండ్రులను తీవ్రంగా గాయపరచడంతో అవాక్కైన అనూష, పటాన్చెరు పోలీసులను ఆశ్రయించారు. అనూషా భర్తపై ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: