దేశంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు జరిగాయి... హత్యలు జరిగాయి అంటూ రోజుకో వార్త తెరమీదకి వస్తూనే ఉంది. కఠినంగా శిక్షించడానికి ఎన్ని చట్టాలు వచ్చినా ఇప్పటికీ కూడా కామాంధులు అకృత్యాల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. విచ్చలవిడిగా ఆడది కనిపిస్తే చాలు మీద పడిపోయి అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేసేస్తున్నారు . నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడంలేదు కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షసులు లాంటి మృగాళ్లు . దీంతో ఆడపిల్లలు ప్రశ్నార్థక జీవితాన్నే గడుపుతున్నారు . కనీసం కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడది అర్ధరాత్రి నిర్భయంగా రోడ్డుమీద తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్టన్నారు గాంధీజీ.... కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అర్ధరాత్రి కాదు కదా... పట్టపగలు రోడ్డు మీదుకు వెళ్లిన కామపు కోరల్లో చిక్కుకుని పిల్ల అంతం అయిపోతుంది .
అయితే దిశా నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపేసిన తర్వాత కూడా ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితుల్లో మార్పు మాత్రం కనిపించడం లేదు. తాజాగా బీహార్ లో మరో దారుణం చోటుచేసుకుంది. బీహార్లోని కురువలో ఐదు ఏళ్ల చిన్నారిపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది . వివరాల్లోకి వెళితే... కురువా లోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి మరో 3 ఏళ్ళ చిన్నారి తో కలిసి ఆడుకుంటుండగా...ఓ ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చాడు. అయితే అక్కడే ఆడుకుంటున్న ఆ చిన్నారులను పార్క్ చేసి ఉన్న తన ఆటోలోకి పిలిచాడు ఆటో డ్రైవర్. ఆటో లో షికారు కి వెళ్దాము అంటూ చెప్పి చిన్నారులను ఎక్కించుకున్నాడు.
అలా ఆటోలో కొద్ది దూరం వెళ్ళాక మూడేళ్ల చిన్నారిని ఆటో నుంచి కిందకు దింపేసాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఐదేళ్ళ చిన్నారిని తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ కీచక ఆటో డ్రైవర్. కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ ఐదేళ్ల చిన్నారిని అక్కడే వదిలేసి ఆటో తో పరారయ్యాడు. ఇదిలా ఉండగా ఇటీవలే బాక్సర్ సమస్తిపూర్ జిల్లా లో కాలిపోయిన స్థితిలో కొంతమంది మహిళలు మృతదేహాలు లభ్యం కావటం కలకలం రేపింది . ఇక స్థానికులు ఈ ఘటన మరువక ముందే... ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరగడం స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తోంది. స్థానికుల అందరూ ఎప్పుడు ఎలాంటి ఘోరం జరుగుతుందోనని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.