దేశ రాజధానైనా ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండిలో గల ఓ భవనంలో ఈరోజు ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 

                               

కాగా క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు హుటాహుటిన తరలించగా 30కి పైగా అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను చల్లారుస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న 56 మందిని సిబ్బంది కాపాడారు. కాగా, ఇరుకైన ప్రాంతంలో ఉన్న భవనం కావటంతో మంటలు చెలరేగడంతో ఊపరి ఆడక పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 

                                

ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో ఇంకా దట్టమైన పొగలు కమ్ముకునే ఉన్నాయిని, మంటలు అదుపులోనికి వచ్చాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ చీప్ ఫైర్ అధికారి సునీల్ చౌదరి తెలిపారు. ఆ భవనంలో ఫ్యాక్టరీ నడుస్తోందని, అక్కడే సిబ్బంది రాత్రి నిద్రించిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

                       

అయితే ఈ అగ్ని ప్రమాదంలో 32 మంది మృతి చెందడంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులు త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: