ఈ మధ్యకాలంలో వ్యభిచారం చేసే వారు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎవరికి అనుమానం రాకుండా తమ దందాను రహస్యంగా కొనసాగిస్తున్నారు. అందుకు గాను కొందరైతే తమ నివాసాలనే వ్యభిచార గృహాలుగా మార్చేస్తున్నారు. మంచి పనులకు ఆకర్షణ తక్కువ, చెడుపనులకు ఆకర్షణ ఎక్కువ అనే సూక్తిని నిజం చేస్తున్నారు.

 

 

ఇకపోతే జనాలకు నివాసం అనే జ్ఞానం కూడ లేకుండా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. వివరాలను పరిశీలిస్తే పుట్టా నీలవేణి(36) అనేమహిళ కొంతకాలం నుంచి ఏలూరు వంగాయ గూడెం సమీపంలోని గొల్లాయిగూడెం గృహకల్ప హౌసింగ్‌ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి తన ఇంట్లో గుట్టుగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓ మహిళ(25) తీసుకొన్ని తన ఇంట్లో నుండి వ్యభిచారం నిర్వహించే క్రమంలో ఆమె ఇంటికి అనేక మంది యువకులు తరచుగా వస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

 

దీనిపై సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ బాల రాజాజీ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేయగా విటులతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ రెడ్ హ్యండెడ్ గా దొరికింది.ఈ సందర్భంగా విటులుగా వచ్చిన వారిలో ఏలూరు శాంతినగర్‌‌కు చెందిన యువకుడు, తాడేపల్లి గూడెంలోని బొమ్మిడికి చెందిన యువకుడు, ఏలూరు దొంగల మండపం ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు.

 

 

వారితో పాటు వ్యభిచార నిర్వాహకురాలు నీలవేణిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును ఫైల్ చేశారు... ఈ క్రమంలో సెక్స్‌వర్కర్‌‌ని అదుపులోకి తీసుకుని సంరక్షణ హోమ్‌కు తరలించారు.  ఇకపోతే ఒకవైపు పోలీసులు వ్యభిచారం విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంతగా దాడులు చేసిన వ్యభిచారం నిర్వహించే నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. సమాజం ఇప్పటికే నాశనం అవుతుందను కుంటే ఈ వ్యభిచారుల వల్ల ఇంకా లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: