ఆధ్యాత్మిక గురువు ముసుగులో ఎంతో మంది మహిళలపై  అత్యాచారం చేయడంతో పాటు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు రావడంతో పోలీసులు నిత్యానందను అరెస్టు చేయడానికి అంతా సిద్ధం చేయగా ... పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు  నిత్యానంద. గత కొన్నాళ్ల క్రితం విదేశాలకు  పారిపోయాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈక్విడార్  వెళ్లి అక్కడ ఓ దీవిని  కొనుక్కుని అక్కడ మొత్తం తన సామ్రాజ్యాన్ని నిత్యానంద నెలకొల్పుతున్నాడు  అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పోలీసులు వెతుకుతున్న అప్పటికీ ఎక్కడున్నాడో ఆచూకీ కూడా తెలియని నిత్యానంద తాజాగా వీడియో  విడుదల చేసారు. ఈ సందర్భంగా వీడియోలు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు నిత్యానంద. 

 


 అయితే తన శిష్యగణాన్ని ఉద్దేశిస్తూ ఈ వీడియోలో మాట్లాడాడు నిత్యానంద. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. నేను పరమశివుడిని నన్ను ఎవరు టచ్ కూడా చేయరు  లేరు... ఏ స్టుపిడ్ కోర్టు కూడా నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు అంటూ నిత్యానంద వీడియోలో మాట్లాడాడు. నేను నిజం చెప్పగలను మీ  ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను  అంటూ తన శిష్యగణాన్ని ఉద్దేశించి నిత్యానంద పలు వ్యాఖ్యలు చేసాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది నిత్యానంద ఎక్కడ ఉన్నాడు అనే విషయం తెలియక పోయినా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారిపోయింది. 

 


 కొన్నాళ్ల క్రితం నేపాల్ మీదుగా నిత్యానంద విదేశాలకు పారిపోయాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చాలా కాలంగా నిత్యానంద ఎక్కడున్నాడో కూడా తెలియకుండా వ్యవహారాలు అన్నింటిని నెట్టుకొస్తున్నాడు. అయితే ఈక్వెడార్ లో ఓ దివిలో నింత్యానంద  ఉన్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ.. నిత్యానంద ఆశ్రయం  పొందేందుకు పెట్టుకున్న శరణార్థి దరఖాస్తును తాము తిరస్కరించినట్లు ఈక్వెడార్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే రేప్ కేసులు నిందితుడిగా ఉన్న నిత్యానంద దేశాన్ని వదిలి పారిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులు కూడా నిత్యానందను పట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: