టెక్నాలజీ పరంగా దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో రోజు మనం చూస్తూనే ఉన్నాం. కాని టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మనుషుల కోరికలు పెరుగుతున్నాయి. కనీసం మనం ఎక్కడ ఉన్నాం మనల్ని అందరు చూస్తున్నారు అన్న స్పృహ కూడా లేకుండా పోతుంది. తము చేసే పని అది ఎక్కడైనా చేసేయాల్సిందే అనేలా విచ్చలవిడిగా చేసేస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మొన్నామధ్య హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్ లో ఓ ప్రేమ జంట ముద్దు ముచట్ల వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది.

 

లేటెస్ట్ గా ఢిల్లీ మెట్రోలోనే పనికానిచ్చారు ఒక ప్రేమ జంట. ఇద్దరు నిలబడి ఉన్నారు.. ఒకరు మూతుల్లో ఒకరు పెట్టి లోకంతో తమకేం పనిలేదు అనేలా రొమాన్స్ చేసుకున్నారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది అన్న ఆలోచన కూడా లేకుండా పబ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.

 

వాళ్ళు అలా ముద్దుల్లో మునిగితెలుతుండగా ఓ కుర్రాడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. క్షణాల్లో అది వైరల్ అయ్యింది. ఢిల్లీ మెట్రోలో జరిగిన ప్రేమ జంట రొమాంటిక్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచింది. ఢిల్లీ మెట్రో అధికారులు సైతం ఈ వీడియోపై స్పందించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  

 

ఒక పక్క అసలే ఆడవాళ్ళ మీద రకరకాల ఘటనలు జరిగి సంచలనం సృష్టిస్తుండగా మరోపక్క అలాంటివి తమకేమి పట్టనట్టుగా కొందరు ఇలా రెచ్చిపోతున్నారు. డిల్లీ మెట్రోలో ఒళ్ళు మరచిపోయి రొమాన్స్ చేసిన ఆ ప్రేమ జంటకు వారి వీడియో సోషల్ మీడియాలో చూసుకుని షాక్ అయ్యారని తెలుస్తుంది. ఇప్పటికే పబ్లిక్ పార్కులను, పబ్లిక్ ప్లేసులను ఇలాంటి కార్యకలాపాలకు వాడుతుండగా మెట్రో లో కూడా చేయడంతో ప్రజలు నేటి యువత ఎంత చెడిపోయిందో అంటూ ఫైర్ అవుతున్నారు.     

 

మరింత సమాచారం తెలుసుకోండి: