ఇటివల హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఓ జంట ముద్దులు పెట్టుకున్న విషయం మనఅందరికి తెలిసిన విషయమే అలాగే ఆ వీడియో సిటీ అంత వాట్సాప్ లలో తిరుగుతూ  వైరల్‌గా మారింది. అయితే  ఇప్పుడు ఏకంగా ఓ  ప్రేమికుల జంట ఢిల్లీ మెట్రో రైల్లోనే ముద్దులతో చాలా ఓవర్ గా ప్రవర్తించారు. చుట్టుపక్కల జనం ఉన్నారన్న భయం లేకుండా  ఇవేం పట్టించుకోకుండా వాళ్లు కౌగిలింతలతో  ముద్దులు పెట్టుకొని రెచ్చిపోయారు.

ఈఘటన ఢిల్లీ మెట్రో రైల్లో చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు ఏసీ చుసిన తోటి ప్రియాణికులు వారిని పట్టించుకోలేదు కొందరు వారి తతంగం అంత వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో  ఇదంతా వైరల్ అయింది. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది. వీరి వ్యవహారాన్ని కొంతమంది ప్రయాణికులు తప్పుగా బావించి రైల్వే అధికారుల దృష్టికి తీలుకెళ్లారు. ఇలా ఊరుకుంటే ఈ వ్యవహారం చాలా దూరం వెళుతుంది అని అధికారులతో వివరించారు.వీరిపైనా కచ్చితంగా చర్య తీసుకోవాలని ఆరోపించారు.  పబ్లిక్ గా వీరు వ్యవహరించిన తీరు సబబు కాదని విమర్శించారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి వచ్చేలా చర్య తీసుకోవాలని దీనిపైనా చర్య తీసుకునే వరకు ఊరుకోమని ఆరోపించారు. దీంతో దీనిపై రికార్డయిన వీడియోను పరిశీలించాక చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. కానీ కుర్రకారికి మెట్రో హాట్ స్పాట్‌గా మారిపోతున్నాయి. కాసింత ఏకాంతం దొరుకుతుందా..అని ఎదురు చూసే లవర్స్..తమ అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. వీరి చేష్టల వల్ల తోటి ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.  ఇలాంటి ప్రేమికుల వ్యవహారం తో తోటి ప్రియాణికులకు,  జనాలందరు  ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి చర్యలను నివారించడానికి పోలీసులకు పెద్ద తలనొప్పి గా తయారైంది. వీటిని వీలైనంత వరకు నిరోధించకుంటే చిన్నపిల్లలకు మరియు యూత్ కి ఇలాంటివి సోకే ప్రమాదం ఉంది అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: