స్నానం చేస్తున్న కన్న కూతురిని ఫోటోలు తీసి ఇద్దరి వ్యక్తులకు పంపించి వాటితో కూతురిని బ్లాక్‌మెయిల్ చేయించింది ఓ కిరాతక తల్లి. కన్నతల్లే కూతురుకి నరకం చూపిస్తున్న ఘటన విడయవాడలో చోటుచేసుకుంది. దీంతో బాదితురాలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. 

 

విజయవాడలోని మొగల్రాజపురంలోని నివసిస్తున్న దంపతులకు 15 ఏళ్ల కూతురు ఉంది. ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటినుండి తండ్రి, కుమార్తెలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. బాధితురాలి తాతకు ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆయనను హైద్రాబాద్‌లో చికిత్స కోసం బాధితురాలి తండ్రి తీసుకెళ్లాడు. అయితే కూతురిని మాత్రం తనతో పాటు హైద్రాబాద్ కు తీసుకెళ్లలేదు. తల్లి వద్ద కూతురిని వదిలి వెళ్లాడు.

 

తండ్రి తిరిగి  15 రోజుల తరువాత తండ్రి హైద్రాబాద్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. రమేష్ తో అత్యంత సన్నిహింతగా ఉండే రమేష్ సాగర్ లు తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించేందుకు తల్లి ప్రోత్సహించిందని తండ్రి చెబుతున్నాడు.

 

తండ్రి హైద్రాబాద్ లో ఉన్నపుడు అతని స్నేహితుడు సాగర్‌తో కలిసి తల్లి, బాదితురాలు కారులో వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తరువాత తల్లి దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. కాని కూతురు ఒంటరిగా కారులో వెళ్లేందుకు ఇష్టపడలేదు. అరిచి కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు కలుగజేసుకుని బాలికను కారు నుంచి బయటకు దింపి ఇంటికి పంపిచారు. 

 

మరోరోజు కూతురు స్నానం చేసి వచ్చి.. బట్టలు మార్చుకుంటుంటే తల్లి ఫోటోలు తీసి సాగర్‌కు , నరేష్ కు పంపించింది. వీటిని కూతురుకి చూపించి బ్లాక్‌మెయిల్ చేయమని సలహ ఇచ్చింది. కూతురు ఒప్పుకోకపోడంతో తండ్రిని కూడా చంపుతామని బెదిరించమంది. 

 

ఈలోపు తండ్రి హైద్రాబాద్ నుండి విజయవవాడకు వచ్చి కూతురిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వచ్చిన తరువాత బాధితురాలు తండ్రికి జరగిన విషయం అంతా వివరించింది. దీంతో తండ్రి కూతురితో కలిసి పోలీస్ ష్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: