దేశంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో  కనీసం మార్పు రావడంలేదు. రేప్ చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపిన కామాంధుల తీరు మారటం లేదు. ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీంతో సగటు ఆడపిల్ల రక్షణ లేని ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతుంది. ఎన్ని కఠిన చట్టాలు వస్తే ఏం లాభం కామాంధుల ఆలోచనకు అడ్డుకట్ట మాత్రం వేయలేక పోతున్నాయి. రోజుకో కొత్త అత్యాచార ఘటన తెరమీదికి వస్తూనే ఉంది. మహిళలకు కనీసం ఎక్కడ రక్షణ లేకుండా అయిపోయింది. అసలు మన దేశంలో మహిళలలుగా  పుట్టడమే తప్ప అంటూ ఆడపిల్లలు బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

 

 అయితే తాజాగా షాద్నగర్లో అమాయకపు వైద్యురాలు దిశను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం. అయితే దిశ ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపినప్పటికీ... కామాంధుల తీరులో మార్పు రాలేదు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో ని తిరుచానూరు సమీపంలోని మరో దారుణం చోటు చేసుకుంది. పదహారేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అతి దారుణంగా అత్యాచారం చేశారు. 

 


 మొదట లిఫ్ట్ ఇస్తానంటూ ఆ బాలికను నమ్మించి మాయమాటలు చెప్పి ఇద్దరు  యువకులు బైక్పై తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో ద్విచక్ర వాహనాన్ని నిర్మానుష్య ప్రదేశంలో కి తీసుకెళ్లారు. అయితే ఆ ఇద్దరు యువకులు వక్రబుద్ధి ని పసిగట్టిన ఆ బాలిక వారి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. దీంతో ఆ బాలికను బెదిరించి మరి లైంగిక దాడికి పాల్పడ్డారు ఆ యువకులు. కాగా  నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన నేడు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు రాజమోహన్,  వెంకటేష్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు స్కూటర్లు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా బాధితురాలి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరు రౌడీషీటర్ కాగా...ఇంకొకరిపై  గతంలో  మర్డర్ కేసు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: