శాస్త్రవేత్తలు అన్ని కనుగొంటున్నారు కాని మనిషి కోరికలను అదుపులో ఉంచే ఉపాయాన్ని మాత్రం కనిపెట్టలేక పోతున్నారు. దేహంలో పుట్టే ఈ కామకోరికల వల్ల  మనిషి పశువుకంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. అతని ప్రవర్తన ఎలా ఉందంటే వయస్సు, హోదా గుర్తుకు కూడా రావడం లేదు. కనీసం వావివరసలు కూడా గుర్తుకు రావడం లేదు. రోజురోజుకు మానవతా విలువలు పతనం అవుతున్నాయి.

 

 

ఇక మగ మృగాళ్లకు కట్టుకున్న భార్య ఉన్నాకూడా వారితో న్యాయపరమైన కోరికలు తీర్చుకోకుండా పరాయి ఆడపిల్లల పై పడుతున్నారు. తమ వక్ర బుద్ధితో  మహిళను భోగవస్తువుగా చూసే ధోరణిలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. తమ వయసు సైతం మర్చిపోయి కొందరు ప్రబుద్ధులు చిన్న పిల్లలపై పశుత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఘోర ఘటనే ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో చోటుచేసుకుంది.

 

 

7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి భర్త పలుమార్లు అత్యాచారం చేయగా ఆ బాలిక గర్భం దాల్చింది. వివరాలు తెలుసుకుంటే  ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న  ఓ పాఠశాల స్టాఫ్ భవనంలో ప్రధానోపాధ్యాయురాలు తో పాతుగా ఆ ఇంట్లో 60 ఏళ్ల వయసున్న ఆమె భర్త కూడా ఉంటున్నాడు. అయితే 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని పై కన్నేసిన ఆ వెధవ  ఆ బాలికను ఇంటికి పిలిపించుకుని  పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

విద్యార్థినికి పరీక్షలు నిర్వహించగా, 3 నెలల గర్భిణిగా తేలింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం బాలికను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇకపోతే ఇలా ప్రవర్తించే మృగాళ్లకు మగతనం అనేది లేకుండా కట్ చేస్తే మరో సారి ఇలాంటి పనికి మాలిన పనులు చేయడానికి ఆలోచిస్తారు. ఇప్పటికే బలహీనమైన మన చట్టంలోని లొసుగులను ఆసరాగా తీసుకుని కొందరు పశువులు ఇలా ప్రవర్తిస్తున్నారు.. అందుకే సమాజం మారాలి. సమాజంతో పాటుగా చట్టాల్లో మార్పు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: