తన పేగు తెంచుకుని పుట్టిన కన్న కూతురు తల్లి కంటికి రెప్పలా రక్షించుకోవాలి. ఏ చిన్న కష్టం రాకుండా అల్లారుముద్దుగా ఆలనాపాలనా చూసుకోవాలి. తన కూతురుకు ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి సమస్యలను పరిష్కరించాలి. కానీ ఇక్కడ తల్లి మాత్రం తన పేగు తెంచుకుని పుట్టిన కన్న కూతురునే తాను అక్రమ సంబంధం పెట్టుకున్న వారి  దగ్గర పడుకోమని చెప్పింది . కనీసం కన్నపేగు తీపి  కూడా మరిచి కీచకురాలిగా  ప్రవర్తించింది ఆ తల్లి. వద్దమ్మా  అంటూ కూతురు  వేడుకున్నప్పటికి కూడా ఆ కన్నతల్లి మనసు కరగలేదు. కన్నతల్లి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కాకుండా తన కూతురును కూడా వాళ్లకు అమ్మేసి  వాల్లతో  పడుకోవాలి  అంటూ కూతురుతో కూతురును బలవంతం చేసింది . సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

 


 విజయవాడలోని మొగల్రాజపురం కి చెందిన భార్యాభర్తలకు 15 ఏళ్ల కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో తండ్రి కూతురు భార్య నుండి వేరుగా ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన తల్లి వేరే ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధానికి తెరలేపింది. ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ నీచ  ఆలోచన చేసింది  ఆ తల్లి. ఓ రోజు బాలిక తాత అనారోగ్యానికి గురికావడంతో బాలిక తండ్రి సికింద్రాబాద్ రావాల్సి వచ్చింది. దీంతో తన కూతురిని తల్లి వద్ద  వదిలేసి తండ్రి సికింద్రాబాద్ వెళ్ళాడు. 

 

 దీంతో కన్న కూతురిని తన దగ్గర వదిలేస్తే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినది పోయి నీచ  ఆలోచన తెరతీసింది  ఆ కన్నతల్లి. తన తో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తులతో పడుకోమని కూతురు బలవంత పెట్టింది. కన్నకూతురు స్నానం చేస్తుండగా ఫోటోలు వీడియోలు తీసి తన అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తులకు పంపించి ఆ ఫోటోలతో తన కూతురుని ఆ వ్యక్తులతో బ్లాక్మెయిల్ చేయించింది ఆ కసాయి తల్లి. ఇక ఆ ఇద్దరు వ్యక్తులు తనతో పడుకోకపోతే నీ తండ్రిని చంపేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టారు. ఇక తండ్రి ఇంటికి రాగానే బాలిక జరిగిన విషయాన్ని తండ్రితో చెబుతూ బోరున విలపించింది. కాగా  బాలికను వెంట తీసుకుని పోలీస్ స్టేషన్ కు  వెళ్లిన  తండ్రి పోలీస్ స్టేషన్ లో  జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత బాలిక తల్లి సహా మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: