ప్రస్తుతం క్రికెట్ మానియా నడుస్తుంది. ఇక దేశంలో దాదాపు క్రికెట్ అంటే అభిమానం లేని వారు ఉండరు. ఎందరో క్రీడాభిమానుల్లో క్రికెట్ అభిమానులు ఎక్కువగా కనిపిస్తారు. ఇక మన ఇండియాలోనైతే క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. క్రికెటర్లను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. ఇకపోతే భారత్‌లో ఐపీఎల్ తరహాలో ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపై మాన్షి సూపర్ లీగ్ జరుగుతోంది. ఈ టోర్నీలో  డుప్లెసిస్. పార్ల్ రాక్స్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న ఇతను, నెల్సన్ మండేలా టీమ్‌ కెప్టెన్ చేతిలో టాస్ ఓడిపోయాడు.

 

 

దీంతో టాస్ గెలిచిన మండేలా టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. మ్యాచ్ ప్రజెంటర్ డుప్లెసిస్‌ని సరదాగా టీమ్‌లో ఏవైనా మార్పులు ఉన్నాయా..? అని అడిగాడు. దానికి అతను చెప్పిన సమాధానంతో ప్రజెంటర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇక ప్రజెంటర్ తో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ నిజాయితీతో చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. ఆ విషయం ఏంటంటే టీమ్‌లో ఒక మార్పు జరిగింది.. హార్డస్ విల్జోయెన్ ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. ఎందుకంటే.. అతను ఇప్పుడు నా చెల్లితో బెడ్‌పై పడుకుని ఉన్నాడు. వారిద్దరికీ నిన్ననే వివాహం జరిగింది..

 

 

అని డుప్లెసిస్ నిజాయితీగా చెప్పేశాడు. ఇకపోతే గత కొంతకాలంగా డుప్లెసిస్ చెల్లెలు రేమీ రైనర్స్‌తో డేటింగ్‌లో ఉన్న విల్జోయెన్.. ఇరు కుటుంబాల అంగీకారంతో తాజాగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో.. అతను మండేలా టీమ్‌తో మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు ఇతను చెప్పిన సమాధానం అక్కడున్న వారందరిని నవ్వుల్లో ముంచెత్తుతుంది.

 

 

ఇకపోతే తొలుత బ్యాటింగ్ చేసిన రాక్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. కెప్టెన్ డుప్లెసిస్ 19 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే.. లక్ష్య ఛేదనలో తడబడిన మండేలా టీమ్ 156/6 కే పరిమితమైంది. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలరైన హార్డస్ విల్జోయెన్ దక్షిణాఫ్రికా తరఫున కేవలం ఒక టెస్టు మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అయితే.. ఐపీఎల్‌లో మాత్రం అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తరఫున 6 మ్యాచ్‌లు ఆడాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: