అత్యాచారం ఇప్పుడు ఈ పదం వింటే చాలు షాద్ నగర్ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు ఏ గుర్తస్తుంది. అంత అమానవీయంగా జరిగింది ఆ ఘటన. పని ఉండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. 

 

అయితే ఆ నీచులు కూడా సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు నిన్న తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు.  

 

అయితే ఈ ఎన్కౌంటర్ లో మృతి చెన్నకేసువులు తల్లి కొడుకు మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నా కోడలు గర్భవతి ఆమెకు రేపు పిల్లాడో, పిల్లో పుడితే ఎవడు సాకుతాడు? లారికొడుకులు చిల్లర పనులు చేస్తరు.. తాగుతరు, చేస్తరు కష్టం చేసుకుని బతికేటోళ్లం, ఐతే పానాలు తీస్తరా అంటూ ఆమె ప్రశ్నలు వేసింది. 

 

దిశ ఆ టైంలో ఎందుకు అక్కడ ఉండాలె..? ఆమె చదువుకుంది, ఆ మాత్రం తెల్వదా ..? లారీ డ్రైవర్లు తాగి ఉంటరు, ఏమైనా చేస్తారు, ఆ పిల్ల చెల్లి టోల్ గేట్ దగ్గరికి పొమ్మంటే పోలేదు, అట్లనే అయ్యింది సక్కగ రెండు ఎకరాలు అమ్మి అయినా సరే ఎన్కౌంటర్ చేసినోళ్లని ఏసి పడేస్తా… ఆడవాళ్ళూ రోడ్లపైన తిరగొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

ఆమె ఒక ఆడది అయినప్పటికీ ఆడవాళ్లను కొంచపరిచేలా మాట్లాడింది. తప్పంతా దిశదే అంటుంది.. నాకొడుకు ఆణిముత్యం.. దానివల్లే అన్యాయంగా చచ్చాడు అంటూ చిల్లర మాటలు మాట్లాడింది చెన్నకేసువులు తల్లి. ఆమె మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే డబ్బు కోసం, తిండి కోసం ఎన్ని క్రైమ్ లు చేసిన తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతుంది. అదేదో ఆమె కొడుకు ఒక అమ్మాయిని కాపాడి చచ్చినట్టు మాట్లాడుతుంది. ఇప్పడు అనిపిస్తుంది.. ఈవిడా గారి అతిగారాబం వల్లే ఆమె కొడుకు ఆలా తయారు అయ్యాడు అని.  

మరింత సమాచారం తెలుసుకోండి: